Sri lanka: అదానీ ప్రాజెక్టులో అమెరికా భారీ పెట్టుబడులు.. చైనాకు చెక్ పెట్టేందుకు వ్యూహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri lanka: ఇండియా మిత్రదేశం శ్రీ లంకలో నానాటికి పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునేందుక భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే శ్రీలంకలోని హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు తీసుకున్న చైనా అక్కడి నుంచి భారత్తో పాటు ఇండో-పసిఫిక్ రీజియన్లో నిఘా పెంచుతోంది. ఈ నేపథ్యంలో చైనాను అడ్డుకునేందుకు భారత్, అమెరికాతో జట్టు కట్టింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక రాజధాని కొలంబోని నౌకాశ్రయ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భారత బిలియనీర్ గౌతమ్ అదానీకి అమెరికా డీఎఫ్సీ 553 మిలియన్ డాలర్లను నిధులను సమకూర్చుతోంది. కొలంబోలోని డీప్ వాటర్ వెస్ట్ కంటైనర్ టెర్మినల్(డబ్ల్యుసీటీ) లో పెట్టుబడులు పెట్టనుంది. ఆసియాలో అమెరికా ప్రభుత్వ ఏజెన్సీ పెడుతున్న అతిపెద్ద పెట్టుబడి ఇదే. ఇది శ్రీలంక అభివృద్ధితో పాటు, భారతదేశంతో సహా ప్రాంతీయ ఆర్థిక ఏకీకరణను ప్రోత్సహిస్తుందని, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DFC) ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read
- K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
- Karnataka Politics: కర్ణాటక రాజకీయంలో హైడ్రామా.. కేబినెట్ కొలువుదీరిన కొద్దిరోజులకే మంత్రి రాజీనామా!
- 2000 vs 2026: పెట్రోల్ రూ. 26, సిలిండర్ రూ.157.. ఈ 26 ఏళ్లలో నిత్యావసరాల ధరలు ఎంత పెరిగాయో తెలుసా?
- Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
Read Also: Isreal-Hamas War: తోటి ప్రజాప్రతినిధి వ్యాఖ్యలపై సెన్సార్.. అమెరికా ప్రతినిధుల సభలో కీలక పరిణామం..
ఈ ప్రాజెక్టులో అదానీకి 51 శాతం వాటా ఉండగా.. శ్రీలంక సంస్థ జాన్ కీల్స్ హెల్డింగ్స్ 34 శాతం వాటాను కలిగగి ఉంది. మిగిలిన మొత్తం శ్రీలంక ప్రభుత్వ ఆధ్వర్యంలోని శ్రీలంక పోర్ట్స్ అథారిటీకి వాటాగా కలిగి ఉంది. గతేడాది చైనా శ్రీలంకలో 2.2 బిలియన్ల పెట్టుబడి పెట్టింది. దీంతో పాటు చైనా రుణ ఉచ్చులో ఇరుకున్న శ్రీలంక హంబన్ టోటా నౌకాశ్రయాన్ని లీజుకు ఇచ్చింది. తాజాగా కొలంబో పోర్టులో భారత్, అమెరికాలు కలిసి పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనాకు చెక్ పెట్టవచ్చు. హిందూ మహాసముద్రంలో అత్యంత రద్దీగా ఉండే పోర్టుల్లో కొలంబో ఒకటి.
గతేడాది నుంచి ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను భారత్ ఆదుకుంది. 4 బిలియన్ల క్రెడిట్ లైన్లను విస్తరించింది. ఇంధనం, ఔషధం, ఎరువులు దిగుమతుల్లో మద్దతుగా సాయం చేసింది. ఇదిలా ఉంటే జూలై నెలలో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత్ లో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే పర్యటించారు. ఆ సమయంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో సమావేశమయ్యారు. కొలంబో పోర్టులోని డబ్ల్యూసీటీ ప్రాజెక్టుపై చర్చించారు. ఈ ప్రాజెక్టుతో పాటు 500 మెగావాట్ల విండ్ ప్రాజెక్టు, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడం వంటి ప్రాజెక్టుల గురించి చర్చించారు.
- Tags
- Adani group
- china
- DFC
- india
- Sri Lankan
తాజావార్తలు
-
Liam Livingstone: ఎస్ఆర్హెచ్ తుది జట్టు ఎంపికలో యజమానుల జోక్యం.. ఆ ప్లేయర్ కోసం నన్ను తొక్కేశారు!
-
Vaibhav Sooryavanshi: 15 ఏళ్ల వండర్ కిడ్కు టాటా భారీ రివార్డ్.. నాడు ‘టాటా కర్వ్’.. నేడు ‘టాటా సియెర్రా’.. ఫీచర్స్ అదుర్స్!
-
AB de Villiers: ముంబై లోకల్ గ్రౌండ్లో అభిమానులతో కలిసి క్రికెట్ ఆడి సందడి చేసిన ‘మిస్టర్ 360’.!
-
K Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై.. రాజీనామాను ఆమోదించిన నితిన్ నబిన్
-
PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..