CJI: అట్టడుగు స్థాయి వారికీ న్యాయం అందుబాటులోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJI: అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి సైతం న్యాయం అందుబాటులోకి రావల్సిన అవసరం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ప్రస్తుతం మనందరి ముందున్న అతిపెద్ద సవాల్ అదేనని అన్నారు. వారికీ న్యాయం అందుబాటులోకి. సుప్రీంకోర్టును రెండు దశల్లో విస్తరించబోతున్నట్టు తెలిపారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఢిల్లీలోని సర్వోన్నత న్యాయస్థాన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సుప్రీంకోర్టును రెండు దశల్లో విస్తరించబోతున్నట్లు సీజేఐ ప్రకటించారు. భవిష్యత్తు సవాళ్లను ధీటుగా ఎదుర్కోవడానికి న్యాయస్థానాలను ఆధునికీకరించడంలో భాగంగా సుప్రీంకోర్టు విస్తరణకు ప్రణాళిక రూపొందించామన్నారు. మరో 27 కోర్టులు, 4 రిజిస్ట్రార్ కోర్టురూమ్ల నిర్వహణకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించినట్టు చెప్పారు. సుప్రీంకోర్టు విస్తరణ తొలిదశలో ఇప్పుడున్న మ్యూజియం, అనుబంధ భవనాన్ని తొలగించి 15 కోర్టుల నిర్వహణకు వీలుగా కొత్త భవనం నిర్మిస్తామని తెలిపారు. అందులోనే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ కోసం గ్రంథాలయాలు, ఈ రెండు సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యదర్శుల కోసం కార్యాలయాలు, వాటి పదాధికారుల సమావేశాల కోసం గదులు, న్యాయవాదులు, కక్షిదారుల కోసం క్యాంటీన్ నిర్మిస్తామని స్పష్టం చేవారు. ఇందుకు సంబంధించి బడ్జెట్తో సహా పూర్తిస్థాయి డీపీఆర్ ఇప్పటికే తయారైందని తెలిపారు. ప్రస్తుతం న్యాయశాఖ చేతుల్లో ఉందన్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం తగిన ప్రాధాన్యం ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Read also: Virat Kohli: చిన్నప్పటి నుంచి ఇష్టంగా చదివే ‘న్యూస్ పేపర్’ కూడా ఫేక్ న్యూస్ రాస్తోంది: విరాట్ కోహ్లీ
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్గాంధీని ప్రశ్నించిన బీజేపీ
ఇక రెండోదశలో భాగంగా సుప్రీంకోర్టుకు అనుబంధంగా ఉన్న కోర్టు భవన సముదాయాలను కూల్చివేసి మరో కొత్త భవనం నిర్మించినున్నట్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. అందులో 12 కోర్టు గదులు, రిజిస్ట్రార్ కోర్టులు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్, అడ్వొకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్లకు లాంజ్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కొత్త భవనాలు దేశ ప్రజల ప్రాధాన్యతలు, రాజ్యాంగ ఆకాంక్షలను నెరవేరుస్తాయని జస్టిస్ చంద్రచూడ్ స్పష్టం చేశారు. న్యాయం అందించే క్రమంలో ఎదురవుతున్న అవరోధాలను అధిగమించడానికి పూర్తిస్థాయిలో సాంకేతికను వినియోగించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు సీజేఐ తెలిపారు. ఈ-కోర్ట్స్ ప్రాజెక్ట్ మూడో దశను అమలుచేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం రూ.7వేల కోట్ల బడ్జెట్ కేటాయించిందని .. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కోర్టులను అనుసంధానిస్తామని తెలిపారు. న్యాయస్థానాల పనితీరులో విప్లవాత్మక మార్పులు వస్తాయని.. కోర్టులను కాగితరహితంగా మార్చడంతో పాటు, రికార్డులన్నింటినీ డిజిటలీకరిస్తామన్నారు. న్యాయవ్యవస్థను తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులోకి తీసుకెళ్లడం తమ లక్ష్యమని జస్టిస్ చంద్రచూడ్ స్పస్టం చేశారు.
- Tags
- Access
- CJI
- courts
- justice
- Lowest Level
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!