Site icon NTV Telugu

AAP Crisis: బీజేపీలోకి హర్భజన్ సింగ్.. చద్దాతో పాటు వెళ్లేది వీరే..

Aap Crisis

Aap Crisis

AAP Crisis: రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కు భారీ షాక్ ఇచ్చారు. తను పార్టీ నుంచి బయటకు వెళ్లిపోవడమే కాకుండా తనతో పాటు ఆప్ ఎంపీలను పట్టుకెళ్లాడు. రాజ్యసభలో ఆప్ పార్టీ మొత్తాన్ని బీజేపీలో విలీనం చేశారు. మూడింట రెండొంతుల మంది ఎంపీలు ఇప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. ఆప్ చద్దాను రాజ్యసభలో డిప్యూటీ లీడర్‌గా తొలగించి, ఆయన స్థానంలో నియమించిన అశోక్ మిట్టల్ కూడా బీజేపీలో చేరుతున్నారు.

Read Also: Cockroaches and Ants: ఎలాంటి కెమికల్స్‌, స్ప్రే లేవు.. ఈ చిట్కాతో ఇంట్లో బొద్దింకలు, చీమలు మాయం.. మళ్లీ వస్తే అడగండి..!

మొత్తం 8 మంది ఎంపీలు బీజేపీలో చేరుతున్నట్లు చద్దా వెల్లడించారు. ఆప్‌కు రాజ్యసభలో మొత్తం 10 మంది ఎంపీలు ఉన్నారు. రాఘవ్ చద్దాతో పాటు ఎంపీలంతా పత్రాలపై సంతకాలు చేసి రాజ్యసభ ఛైర్మన్‌కు సమర్పించారు. ఆప్ నుంచి బీజేపీలో చేరుతున్న ఎంపీల్లో మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కూడా ఉన్నారు. స్వాతి మలివాల్ కూడా కాషాయ కండువా కప్పుకోనున్నారు.

ఆప్ నుంచి బీజేపీలో చేరుతున్న వారు వీరే:

స్వాతి మలివాల్, అశోక్ మిట్టల్, సందీప్ పాఠక్, హర్భజన్ సింగ్, బల్బీర్ సింగ్ సీచెవాల్, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ. వీరంతా పంజాబ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు.

Exit mobile version