Madhya Pradesh Farmers: అదృష్టం తలుపు తట్టిన వేళ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Group Of Farmers In Madhya Pradesh Panna Found A Valuable Diamond: అదృష్టం తలుపు తడితే.. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఇందుకు ఉదాహరణగా కొన్ని సందర్భాలు చోటు చేసుకున్నాయి కూడా! ఇప్పుడు తాజాగా అలాంటి సందర్భమే మరొకటి వెలుగులోకి వచ్చింది. వజ్రాలు దొరుకుతాయన్న సంకల్పంతో తవ్వకాలు మొదలుపెట్టిన రైతులకు.. ఎట్టకేలకు ఒక బహుమూల్యమైన వజ్రం దొరికింది. దీంతో వాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా బ్రిజ్పూర్కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు.. కొంతకాలం క్రితం తన ఆరుగురు స్నేహితులతో కలిసి లల్కీ ధేరి ప్రాంతంలో ఒక వజ్రాల మైన్ని లీజుకు తీసుకున్నాడు.
అప్పట్నుంచి వాళ్లందరూ కలిసి వజ్రాల వేట ప్రారంభించారు. ఒక నెల రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు. కానీ, వజ్రాలు దొరకలేదు. అయినా నిరాశచెందకుండా.. ఎలాగైనా వజ్రాల్ని సాధించాలన్న సంకల్పంతో తమ వేటని ముందుకు కొనసాగించారు. ఈ క్రమంలోనే వారికి గురువారం 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందని చాలా సంతోషించారు. ఆ వజ్రాన్ని తీసుకొని వాళ్లు వెంటనే డైమండ్ ఆఫీస్కు తీసుకెళ్లి, అధికారులకు చూపించారు. దాన్ని పరిశీలించిన అధికారులు.. ఆ వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేశారు. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును తాము సమానంగా పంచుకొని, ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని చెప్పారు.
Also Read
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
- PM Modi on NEET Protest: నీట్ పేపర్ లీక్ వివాదంపై మౌనం వీడిన ప్రధాని మోడీ.. ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు ఆదేశం
- CJP Protest: విద్యార్థుల మాటున అసాంఘిక శక్తులు.. CJP నిరసనలపై పోలీసుల సంచలన ప్రకటన..
ప్రభుత్వ నియమాల ప్రకారం.. ప్రభుత్వేతర మైన్స్ లేదా పొలాల్లో వజ్రాలు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే, దాని మొత్తం విలువలో నుంచి యజమానికి 12.50 శాతం డబ్బులు అందుతాయి. అంటే.. ఈ రైతులకు కూడా అంతే మొత్తం అందుతుంది. ఒకవేళ ఈ నిధి గురించి ప్రభుత్వానికి తెలియజేయకపోతే, ఈ వ్యవహారం కోర్టుకెక్కుతుంది. అప్పుడు యజమాని ఆ నిధి తనదేనని చట్టబద్ధంగా నిరూపించుకోవలసి ఉంటుంది. కాగా.. పన్నాలోని జర్వాపూర్ గ్రామంలోనూ మరో రైతుకి ఇటీవల రూ. 30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. అయితే.. అతడు దాదాపు రెండేళ్ల పాటు తవ్వకాలు జరిపాడు.
తాజావార్తలు
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
-
Blood Pressure Readings: బీపీ ఎక్కువా? తక్కువా?.. అసలు బీపీ రీడింగ్స్ అర్థం ఏమిటో తెలుసా..?
-
Vivienne Pitt : బ్రాడ్ పిట్ ఇంటిపేరుకు మరో షాక్.. లీగల్గా తొలగించేందుకు ఏంజెలీనా కుమార్తె పిటిషన్!
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!