Madhya Pradesh Farmers: అదృష్టం తలుపు తట్టిన వేళ.. రాత్రికి రాత్రే కోటీశ్వరులైన రైతులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
A Group Of Farmers In Madhya Pradesh Panna Found A Valuable Diamond: అదృష్టం తలుపు తడితే.. బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. ఇందుకు ఉదాహరణగా కొన్ని సందర్భాలు చోటు చేసుకున్నాయి కూడా! ఇప్పుడు తాజాగా అలాంటి సందర్భమే మరొకటి వెలుగులోకి వచ్చింది. వజ్రాలు దొరుకుతాయన్న సంకల్పంతో తవ్వకాలు మొదలుపెట్టిన రైతులకు.. ఎట్టకేలకు ఒక బహుమూల్యమైన వజ్రం దొరికింది. దీంతో వాళ్లు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లా బ్రిజ్పూర్కు చెందిన రాజేంద్ర గుప్త అనే రైతు.. కొంతకాలం క్రితం తన ఆరుగురు స్నేహితులతో కలిసి లల్కీ ధేరి ప్రాంతంలో ఒక వజ్రాల మైన్ని లీజుకు తీసుకున్నాడు.
అప్పట్నుంచి వాళ్లందరూ కలిసి వజ్రాల వేట ప్రారంభించారు. ఒక నెల రోజుల పాటు నిరంతరాయంగా శ్రమించారు. కానీ, వజ్రాలు దొరకలేదు. అయినా నిరాశచెందకుండా.. ఎలాగైనా వజ్రాల్ని సాధించాలన్న సంకల్పంతో తమ వేటని ముందుకు కొనసాగించారు. ఈ క్రమంలోనే వారికి గురువారం 3.21 క్యారెట్ల వజ్రం దొరికింది. దీంతో.. వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తాము పడిన కష్టానికి ఫలితం దక్కిందని చాలా సంతోషించారు. ఆ వజ్రాన్ని తీసుకొని వాళ్లు వెంటనే డైమండ్ ఆఫీస్కు తీసుకెళ్లి, అధికారులకు చూపించారు. దాన్ని పరిశీలించిన అధికారులు.. ఆ వజ్రం విలువ భారీ మొత్తంలో ఉండొచ్చని అంచనా వేశారు. ఆ వజ్రాన్ని వేలం వేయడం ద్వారా వచ్చే డబ్బును తాము సమానంగా పంచుకొని, ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తామని చెప్పారు.
Also Read
- Bharat Gaurav: నేపాల్కు 'భారత్ గౌరవ్' పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
- What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Mamata Banerjee: రాజకీయ అహంకారానికి పేదలే మూల్యం చెల్లిస్తున్నారు.. బెంగాల్లో బుల్డోజర్ చర్యలపై మమతా ఫైర్
- UDF Kerala Government: కేరళంలో ‘యూడీఎఫ్’ నూతన శకం.. నేడే సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం! మంత్రుల జాబితా ఇదే..
ప్రభుత్వ నియమాల ప్రకారం.. ప్రభుత్వేతర మైన్స్ లేదా పొలాల్లో వజ్రాలు లేదా ఇతర విలువైన వస్తువులు దొరికితే, దాని మొత్తం విలువలో నుంచి యజమానికి 12.50 శాతం డబ్బులు అందుతాయి. అంటే.. ఈ రైతులకు కూడా అంతే మొత్తం అందుతుంది. ఒకవేళ ఈ నిధి గురించి ప్రభుత్వానికి తెలియజేయకపోతే, ఈ వ్యవహారం కోర్టుకెక్కుతుంది. అప్పుడు యజమాని ఆ నిధి తనదేనని చట్టబద్ధంగా నిరూపించుకోవలసి ఉంటుంది. కాగా.. పన్నాలోని జర్వాపూర్ గ్రామంలోనూ మరో రైతుకి ఇటీవల రూ. 30 లక్షల విలువ చేసే వజ్రం దొరికింది. అయితే.. అతడు దాదాపు రెండేళ్ల పాటు తవ్వకాలు జరిపాడు.
తాజావార్తలు
-
James Hopes: “గెలిచే మ్యాచ్లను చేతులారా పాడుచేసుకున్నాం”.. ఆఫ్ ది ఫీల్డ్ వివాదాలపై పంజాబ్ కోచ్ క్లారిటీ!
-
Rashmika : విజయ్ దేవరకొండ కోసం కాదు..ఒక అబ్బాయి కారణంగా ఆ పని చేశా..
-
Bharat Gaurav: నేపాల్కు ‘భారత్ గౌరవ్’ పర్యాటక రైలు.. ప్రారంభించనున్న ఐఆర్సీటీసీ.. ఛార్జీలు, పూర్తి వివరాలు
-
Mexico Gun Attack: రక్తసిక్తమైన మెక్సికో.. ప్యూబ్లాలో విచక్షణారహితంగా కాల్పులు.. చిన్నారితో సహా 10 మంది మృతి!
-
Kharif Water Release: ఖరీఫ్కు నీటి విడుదలపై ప్రభుత్వం ఫోకస్.. కృష్ణా, గోదావరి డెల్టాలకు యాక్షన్ ప్లాన్ సిద్ధం
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..