NTV Telugu Site icon

UP Stampede: ఘోర విషాదం.. యూపీ తొక్కిసలాటలో 107 పైగా మృతి..

Up

Up

UP Stampede: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. హత్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 107 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుండి తాజగా అందిన లెక్కల ప్రకారం, 107 మందికి పైగా మరణించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నారు.

హత్రాస్ జిల్లాలో శివుడికి సంబంధించిన ధార్మిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ముగియగానే, తొక్కిసలాట జరిగింది. మానవ్ మంగళ్ మిలన్ సద్భావనా సమాగం కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. అకాస్మత్తులగా తొపులాట జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అంతా బయటకు వచ్చారని, డ్రెయిన్ పైన రోడ్డు నిర్మించారని, అంతా అందులోపడి నలిగిపోయారని చెప్పారు.

Read Also: Nimmala Ramanaidu: గత ప్రభుత్వ పాలన పోలవరానికి శాపంగా మారింది..

ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహాయక చర్యల్ని ముమ్మరం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సైతం మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌పై పోస్ట్‌లో తెలిపారు. ఇద్దరు రాష్ట్ర మంత్రులు లక్ష్మీ నారాయణ్ చౌదరి మరియు సందీప్ సింగ్ గ్రామానికి బయలుదేరారు.