
ఢిల్లీలో కరోనా కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రంలో అనేక ఆసుపత్రులను కరోనా ఆసుపత్రులుగా మార్పులు చేశారు. ఇందులో బడా హిందూరావ్ ఆసుపత్రి కూడా ఒకటి. ఈ ఆసుపత్రిలో కరోనా రోగుల కోసం 250 పడకలను ఏర్పాటు చేశారు. ఈ పడకలన్నీ కూడా కరోనా రోగులతో ఫుల్ అయ్యాయి. ఆయితే, ఈ ఆసుపత్రి నుంచి ఏప్రిల్ 19 నుంచి మే 6 వ తేదీ వరకు 23 మంది కరోనా రోగులు పరారైయ్యారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఆసుపత్రిలో చెప్పకుండా వీరంతా పరారైనట్టు అధికారులు పేర్కొన్నారు. పరారైన రోగుల కోసం అధికారులు, పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు.