Pirate attack: తమిళనాడు మత్స్యకారులపై శ్రీలంక పైరెట్స్ అటాక్..

  • భారత మత్స్యకారులపై శ్రీలంక సముద్ర దొంగల దాడి..
  • విలువైన సామాగ్రి దోపిడి..
Pirate Attack

Pirate Attack

Pirate attack: తమిళనాడు మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లిన సమయంలో శ్రీలంకకు చెందిన పైరెట్స్(సముద్రపు దొంగలు) దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 17 మంది మత్స్యకారులకు గాయాలయ్యాయి. నాగపట్నం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలర్లు శుక్రవారం కోరమండల్ తీరంలో చేపలు పడుతుండగా దాడి జరిగినట్లు చెప్పారు.

Read Also: BJP: కాంగ్రెస్ ‘‘పాకిస్తాన్ వర్కింగ్ కమిటీ’’గా మారింది.. ఎంపీ ‘‘సర్జికల్ స్ట్రైక్స్’’ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్..

×
×
Ad

ఫైబర్ బోట్‌లో వచ్చిన ఆరుగురు దొంగలు మత్సకారుల వద్ద ఉన్న వలలు, జీపీఎస్ పరికరాలను దోచుకుని వెళ్లారు. వీటి విలువ రూ. 10 లక్షల వరకు ఉంటుందని చెప్పారు. పదునైన ఆయుధాలతో భారత పడవల్ని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పారు. ఈ దాడి భారత సముద్ర జలాల్లో జరిగిందని వెల్లడించారు.

ఒడ్డుకు వచ్చిన తర్వాత గాయపడిన 17 మందిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని, తమను ఆదుకోవాలని, ఇలాంటి దాడులు కొనసాగితే నిరవధిక సమ్మెకు వెళ్తామని మత్స్యకారులు హెచ్చరించారు. గత ఏడాది డిసెంబర్ లో ఇలాంటి ఘటనే జరిగింది. ఆ సమయంలో ముగ్గురు తమిళనాడు మత్స్యకారులు గాయపడ్డారు.