Site icon NTV Telugu

Road Accident: మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 11 మంది మృతి

Road Accident

Road Accident

Road Accident: మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌లో ఈరోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెతుల్ జిల్లాలోని ఝల్లార్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు, కారు ముందు వైపు నుండి ఒకదానికొకటి ఢీకొట్టకున్నాయి. ఈ ఘటనలో 11 మంది అక్కడికక్కడే మృతిచెందిరు. అయితే ఓ ప్రయాణికుడికి తీవ్ర గాయాలు కాగా.. అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈఘటనపై బేతుల్ ఎస్పీ సిమ్లా ప్రసాద్ కు సమాచారం అందించారు. అయితే.. ఫోటోలో వున్న విధంగా చూస్తే.. బస్సు – కారు ఎదురెదురుగా ఢీకొన్నాయని అర్థం అవుతోంది. కారు ఎలా తుక్కుతుక్కు అయిందో చూడవచ్చు. కారులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది చనిపోయారని భావిస్తున్నారు. బస్సు ముందు భాగం మాత్రమే దెబ్బతింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 11 మంది కూలీలు మహారాష్ట్రలోని అమరావతి నుంచి తిరిగి వస్తుండగా గుడ్‌గావ్ మరియు భైస్‌దేహి మధ్య ఝల్లార్ పోలీస్ స్టేషన్ సమీపంలో తెల్లవారుజామున 2 గంటలకు ప్రమాదం జరిగింది. ఎస్‌యూవీ బస్సును ఢీకొనడానికి ముందు డ్రైవర్ నిద్రమత్తులో పడిపోయాడు. ఏడు మృతదేహాలను వెంటనే బయటకు తీశామని, అయితే మిగిలిన మృతదేహాలను బయటకు తీయడానికి వాహనాన్ని చెక్కాల్సి ఉందని బేతుల్ సీనియర్ పోలీసు అధికారి సిమ్లా ప్రసాద్ తెలిపారు.

ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి ₹ 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. బెతుల్‌లో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, మరణించిన ప్రతి ఒక్కరికి తదుపరి బంధువులకు PMNRF నుండి ₹ 2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వబడుతుందని, క్షతగాత్రులకు ₹ 50,000 అందజేస్తాం’’ అని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.

గతనెల అక్టోబర్ 21 రాత్రి మధ్యప్రదేశ్‌లోని రేవాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. పండుగరోజు దీపావళికి రెండు రోజుల ముందే రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్ పరిధిలో సోహగి పర్వతాల వద్ద బస్సు ట్రక్కు ఢీకొట్టడంతో.. 15 మంది ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నుంచి యూపీ రాజధాని లక్నో వస్తున్న ఈ బస్సులో రోజు కూలీలు ఉన్నారు. దీంతో మధ్యప్రదేశ్‌లో వరుస ప్రమాదాలపై ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
PVN Madhav: తాళాలు పగులగొట్టి గోడలు దూకడం ఏంటి?

Exit mobile version