NTV Telugu Site icon

Manipur: మణిపూర్‌లో డ్రోన్ బాంబు దాడి.. పరిస్థితి ఉద్రిక్తత

Manipur

Manipur

మణిపూర్‌లో డ్రోన్ బాంబు దాడి కలకలం రేపింది. ఈ ఘటనలో మహిళ గాయపడింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సెంజామ్ చిరాంగ్‌లో సోమవారం జరిగిన మరో డ్రోన్ బాంబు దాడిలో 23 ఏళ్ల మహిళ గాయపడినట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఇంఫాల్ పశ్చిమ జిల్లా కౌత్రుక్ గ్రామంలో అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన అనేక డ్రోన్‌ బాంబుల తర్వాత తాజా దాడి జరిగింది. సాయంత్రం 6.20 గంటలకు డ్రోన్ల ద్వారా రెండు బాంబులు పడ్డాయి. ఈ ఘటనలో వాతం సనాతోన్బీ దేవి అనే మహిళ గాయపడింది.

ఇది కూడా చదవండి: Kolkata Doctor Case: కోల్‌కతా వైద్యురాలి కేసులో కీలక పరిణామం.. కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్‌ఘోష్‌ అరెస్ట్..

ఇంఫాల్ తూర్పు జిల్లాలోని సగోల్‌మాంగ్‌లోని ఇండియా రిజర్వ్ బెటాలియన్ (IRB) పోస్ట్‌పై సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. పారిపోయే ముందు వారు రెండు అసాల్ట్ రైఫిళ్లు, లైట్ మెషిన్ గన్‌ని లాక్కున్నారని వర్గాలు తెలిపాయి. ఆదివారం అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు జరిపిన కాల్పుల్లో, డ్రోన్ దాడుల్లో ఇద్దరు వ్యక్తులు మరణించారు. అలాగే 12 ఏళ్ల బాలికతో సహా తొమ్మిది మంది గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: Supreme court: చలో సెక్రటేరియట్‌ ఘటనలో బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

మణిపూర్ బీజేపీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ ఇమో సింగ్ మాట్లాడుతూ. కేంద్ర బలగాలు హింసను అరికట్టడంలో విఫలమైతే రాష్ట్రం నుంచి కేంద్ర బలగాలను ఉపసంహరించుకోవాలని కోరారు. కేంద్ర బలగాలు ఫలితాలను అందించడంలో విఫలమైతే.. జాతి హింసకు గురైన రాష్ట్రంలో శాంతిని పునరుద్ధరించే ప్రయత్నంలో రాష్ట్ర భద్రతా సిబ్బంది బాధ్యతలు స్వీకరించడానికి అనుమతించాలని ఇమో సింగ్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..