తమిళనాడులోని కరూర్ జిల్లా కుప్పుచ్చిపాలయంకు చెందిన గుణశేఖరన్.. ఆయన కుమారుడు జగదీశ్తో కలిసి ఇంట్లో మద్యం తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. వారి నుంచి 8 లిక్కర్ బాటిళ్లు, తయారీకి వినియోగించే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. తాము తాగేందుకే తయారీ ప్రారంభించమని తెలిపారు. మిగిలిన మద్యాన్ని ఇతరులకు విక్రయిస్తున్నామని పోలీస్ ఎంక్వైరీలో తెలిపారు. అంతేకాదు, యూట్యూబ్ వీడియో చూసి వారు ఆల్కహాల్ తయారు చేస్తున్నట్లు అధికారులకు తెలిపారు. ఈమేరకు ఆ తండ్రీకొడుకులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. లాక్ డౌన్ సమయంలో స్వయంగా మద్యం తయారు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోతుందని పోలీసులు తెలిపారు.