Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ సినిమా గురించి ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారంటే.. ‘అజ్ఞాతవాసి’ వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు ఈ సినిమా నిర్మాత చిన్నబాబుతో కలిసి 48 రోజుల్లోనే ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించుకున్నట్లు త్రివిక్రమ్ వెల్లడించారు. నష్టాలను పూడ్చేందుకు తన రెమ్యునరేషన్ను తిరిగి ఇచ్చినట్లు కూడా ఆయన వెల్లడించారు.
ఆ సమయంలో జూబ్లీహిల్స్లో తాను ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లు త్రివిక్రమ్ చెప్పారు. ఆ కొత్త ఇల్లు పూర్తయిన తర్వాత కుటుంబంతో కలిసి అక్కడికి మారాలని భావించినట్లు చెప్పారు. ఆ టైంలో తన పిల్లలు చదువుకొంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఏర్పడిన నష్టాల భారం తీవ్రంగా మారడంతో.. నిర్మాణంలో ఉన్న ఆ ఇంటిని అమ్మేసి నష్టాలను పూడ్చుకోవాలని కూడా ఒక దశలో ఆలోచించినట్లు త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని తన భార్య, పిల్లలతో కూడా చర్చించినట్లు త్రివిక్రమ్ చెప్పారు. అవసరమైతే నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయించి, ప్రస్తుతం ఉంటున్న అపార్ట్మెంట్లోనే కొనసాగాల్సి రావచ్చని వారికి చెప్పినట్లు వెల్లడించారు. అయితే దానికి తన భార్య, పిల్లలు మాత్రం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని త్రివిక్రమ్ చెప్పారు. ఇల్లు ఉన్నా లేకపోయినా.. కుటుంబంగా కలిసి ఉండటమే ముఖ్యమని, అదే అపార్ట్మెంట్లో కొనసాగేందుకు తాము సిద్ధమేనని వాళ్లు చెప్పినట్లు తెలిపారు. భారీ అంచనాలతో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో అప్పట్లో ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరిగింది. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఎదురైన పరిస్థితులను ఆయన స్వయంగా గుర్తుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

