టాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ తిరువీర్ హీరోగా నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘పాపం ప్రతాప్’. ఎస్పి దుర్గ నరేష్ దర్శకత్వంలో, ఈ సినిమా ఏప్రిల్ 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ ఇంటర్వ్యూస్లో అలానే ఈవెంట్లో తిరువీర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో తిరువీర్ తన జీవితంలోని అత్యంత విషాదకరమైన సంఘటనను పంచుకున్నారు. సినిమాల పట్ల తనకున్న నిబద్ధత తనను ఎంతటి మానసిక క్షోభకు గురిచేసిందో వివరిస్తూ.. “గతంలో రెండు సినిమాల కంటిన్యూటీ ఇష్యూస్ వల్ల నేను నా తల్లిదండ్రులకు జరగాల్సిన కర్మకాండలు సరిగ్గా నిర్వహించలేకపోయాను. ఒక్కడే కొడుకువి అయ్యుండి ఈ మాత్రం కూడా చేయలేవా అని బంధువులు నన్ను తిట్టారు. ఆ గిల్ట్ నా గుండెల్లో ఎప్పటికీ ఉంటుంది.” అని కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read :Dude:‘డ్యూడ్’.. టెలివిజన్ ప్రీమియర్ డేట్ ఫిక్స్!
తాజాగా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో తిరువీర్ మాట్లాడుతూ “మంచి సినిమా చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనం వరకు తీసుకెళ్లడం ఇప్పుడు మరో యుద్ధం అయిపోయింది. గత సినిమాల విషయంలో మంచి టాక్ వచ్చినా, థియేటర్లలో ఉన్నప్పుడే జనం వరకు రీచ్ కాలేకపోయామనే బాధ ఉంది” అని చెప్పుకొచ్చారు. ఈసారి తన సినిమాను ప్రేక్షకులకు చేరవేయడంలో ఎలాంటి లోటు ఉండకూడదని తిరువీర్ వినూత్నంగా ప్రమోషన్లు చేశారు. ఇది కుటుంబం మొత్తం కలిసి కూర్చొని హాయిగా నవ్వుకునే ‘ఫీల్ గుడ్’ సినిమా అని ఆయన హామీ ఇచ్చారు. సాధారణ ప్రేక్షకుడికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ సినిమా టికెట్ ధరను కేవలం రూ. 100 మాత్రమే నిర్ణయించినట్లు వెల్లడించారు.
