సంగీతం… హాస్యం మేళవింపుగా తెలుగు ఇండియన్ ఐడిల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు ఇండియన్ ఐడిల్ సెకండ్ ఎపిసోడ్ శనివారం స్ట్రీమింగ్ అయ్యింది. మొదటి ఎపిసోడ్ బాటలోనే ఇదీ సాగింది. ఇందులోనూ సంగీతంతో పాటు హాస్యానికి ప్రాధాన్యమించారు. విశేషం ఏమంటే… మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పంచ్ డైలాగ్స్ తో ఆకట్టుకుంటున్నాడు. యాంకర్ శ్రీరామచంద్ర టోన్ జీన్స్ వేసుకోవడాన్ని చూసి ‘నీ డ్రస్ డిజైనర్ ఎవరు? ఎందుకలా చిరిగిన జీన్స్, షర్ట్స్ నీతో వేయిస్తున్నాడు?’ అంటూ జోక్ చేశాడు. అతనికి డబ్బులు పూర్తిగా ఇవ్వలేదని, అందుకే వాటిని చింపి ఇస్తున్నాడంటూ శ్రీరామచంద్ర బదులిచ్చాడు.
ఈ సెకండ్ ఎపిసోడ్ నెల్లూరుకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్ళతో మొదలైంది. నెల్లూరు చేపల పులుసుకు ప్రసిద్ధి అంటూ తమన్ చెప్పడమే కాకుండా…. తనది కూడా ఆ వూరేనంటూ కంటెస్టెంట్స్ లో కాస్తంత కాన్ఫిడెన్స్ ను నింపే ప్రయత్నం చేశాడు. వైష్ణవి ‘వన్ నేనొక్కడినే’ మూవీలోని ‘ఆవ్ తుజొ మోకార్తా’ సాంగ్ పాడింది. ఆ తర్వాత వచ్చిన ఆమె చెల్లి వాగ్దేవి ‘ఆచార్య’ మూవీలోని ‘లాహే లాహే’ గానంతో ఆకట్టుకుంది. ఇద్దరు లేడీ సింగర్స్ వాయస్ నూ తానే తనదైన శైలిలో పాడి తమన్ మనసు గెలుచుకుంది. వాగ్దేవికి తమన్, నిత్యామీనన్, కార్తీక్ ‘యస్’ చెప్పగా, వైష్ణవికి మాత్రం తమన్, కార్తీక్ యస్ చెప్పారు. నిత్యా మీనన్ నో చెప్పింది. మెజారిటీ ఓట్లతో ఆమె కూడా ప్రమోట్ అయ్యింది. వాగ్దేవి వాయిస్ కల్చర్ నచ్చడంతో మణిశర్మకు ఆమెను రికమండ్ చేస్తానని తమన్ మాట ఇచ్చాడు.
Also Read
- Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
- Shahid Kapoor: ప్రభాస్ ‘కల్కి’ దెబ్బకు షాహిద్ కపూర్ ‘అశ్వద్ధామ’ ఔట్? నిర్మాత షాకింగ్ కామెంట్స్!
- Telangana: సినిమా టికెట్లపై సరికొత్త జీవో: 'స్పెషల్ థియేటర్స్' కేటగిరీ.. రోజూ 5 షోలకు గ్రీన్ సిగ్నల్!
- Toxic Ticket Prices: డబ్బింగ్ మూవీకి ఇంత రేటా? ‘టాక్సిక్’ టికెట్ ధరలపై సినీ లవర్స్ ఫైర్!
Read Also : Prakash Raj : బాక్స్ ఆఫీస్ దగ్గర కక్ష సాధింపులు… ఏమైనా ఉంటే రాజకీయాల్లో…
ఆ తర్వాత వచ్చిన లాలస ‘స్వాతి కిరణం’లోని ‘ఆనతి నీయరా…’ గీతంతో అందరినీ మెస్మరైజ్ చేసింది. అమెరికా నుండి సంగీతం నేర్చుకోవడం కోసమే నాలుగేళ్ళ క్రితం తాను ఇండియా వచ్చానని చెప్పింది లాలస. ప్రముఖ సింగర్ శ్రీరామచంద్రకు ఆమె కజిన్ కావడం విశేషం. ఆమె పాటకు ఫిదా అయిన జడ్జెస్ గ్రాండ్ ఫినాలే అనుభూతి తమకు కలిగిందని చెప్పారు. ఈ ఎపిసోడ్ లో గోల్డెన్ మైక్ ను లాసస సొంతం చేసుకుంది. ఆ తర్వాత మనీష్… ‘ట్రిపుల్ ఆర్’లోని ‘నాటు నాటు’ పాటను ర్యాప్ స్టైల్ లో పాటడమే కాదు… దానికి తగ్గట్టుగా స్టెప్పులూ వేశాడు. దాంతో న్యాయనిర్ణేతలు తామున్న వేదిక డాన్స్ కాంపిటీషన్ కు సంబంధించిందా అనే అనుమానంలో పడ్డారు. అయితే మనీష్ తపనను గుర్తించిన వీరు అతను కోరుకున్నట్టు సెల్ఫీ దిగి పంపేశారు.
ఈ ఎపిసోడ్ లోనూ జీవితంలో ఎదురీదుతున్న ఓ సింగర్ ను వీక్షకుల ముందుకు నిర్వాహకులు తీసుకొచ్చారు. హోటల్ లో, బార్ లో వెయిటర్ గా పనిచేసే మారుతీ ఎప్పటికైనా సింగర్ కావాలన్నది తన అభిమతమని చెప్పాడు. అతను పాడిన పాటతో ఖుషీ అయిన జడ్జెస్ గోల్డెన్ టిక్కెట్ ఇచ్చారు. ఇక చివరగా బోడా జయంత్ మాధుర్ వచ్చి ‘ఆంధ్రావాలా’లోని ‘నైరే నైరే… ‘పాట అందుకున్నాడు. భారీ కాయాన్ని కూడా పట్టించుకోకుండా బోలెడంత ఎనర్జీతో ఆ పాట పాడాడు. అయితే థమన్ మాత్రం తనకోసం ఓ మంచి మెలోడీ సాంగ్ పాడమని చెప్పడంతో ‘ఉండిపోరాదే…’ గీతాన్ని ఆలపించాడు. అతనికీ న్యాయనిర్ణేతలు యస్ చెప్పారు. ఈ రకంగా ప్రతి ఎపిసోడ్ లోనూ ఒకరికి గోల్డెన్ మైక్, మరొకరికి గోల్డ్ టిక్కెట్… కొందరికి యస్ చెబుతున్నారు తమన్, నిత్యా, కార్తీక్.
మరి వచ్చే వారం ఎవరెవరు తమ అదృష్టం పరీక్షించుకుంటారో, వారిలో ఎవరు ముందుకు వెళతారో చూడాలి.
- Tags
తాజావార్తలు
-
Telangana Congress : కొండా సురేఖ, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు.!
-
AP High Court: కోర్టు ఆదేశాలను తేలిగ్గా తీసుకోవద్దు.. అధికారులకు హైకోర్టు వార్నింగ్..
-
OTR : అమరావతిలో MLA క్వార్టర్స్ రెడీ..వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకుంటారా?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు డెడ్లైన్.. హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం కీలక సమాచారం
-
Star Couple: బిగ్ డెసిషన్ తీసుకున్న బాలీవుడ్ స్టార్ కపుల్.. నిర్మాతలుగా మారుతున్న సిద్ధార్థ్ మల్హోత్రా, కియారా!
ట్రెండింగ్
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!