‘యుగ యుగమైన తరగని వేదన’… ‘భగత్ సింగ్ నగర్’ నుంచి పాట విడుదల

bhagath singh nagar

bhagath singh nagar

గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై విదార్థ్, ధృవిక జంటగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో వాలాజా గౌరి, రమేష్ నిర్మిస్తున్న చిత్రం ‘భగత్ సింగ్ నగర్’. తెలుగు, తమిళ బాషలలో రానున్న ఈ సినిమా నుంచి ‘యుగ యుగమైన తరగని వేదన’ అనే పాటను విడుదల చేసింది యూనిట్. తాము విడుదల చేసిన ముందు రెండు పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చిందని ఇప్పుడు రిలీజ్ చేస్తున్న ఈ మూడో పాట కూడా ఆకట్టుకుంటుందంటున్నారు నిర్మాతలు.

అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. చిత్ర పరిశ్రమకు ఇలాంటి నిర్మాతల అవసరం ఎంతో ఉందని, ఏది అడిగినా కాదనకుండా తెలుసుకుని వెంటనే కావలసిన ఏర్పాట్లు చేసే ఈ నిర్మాతలు మరిన్ని మంచి సినిమాలు తీయాలని దర్శకుడు క్రాంతి చెబుతున్నారు.