ముంబై ఎయిర్పోర్ట్లో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాకు చేదు అనుభవం ఎదురైంది. విమానాశ్రయం లోపలికి వెళ్తుండగా ఆమెను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. డ్రస్కు తగ్గట్టుగా ఆమె మ్యాచింగ్ బ్లాక్ గ్లాసెస్ ధరించింది. ఆమెను గుర్తుపట్టలేకపోయారు. దీంతో బ్లాక్ గ్లాసెస్ తీయించిన తర్వాతనే లోపలికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సోనాక్షి సిన్హా ఇటీవలే జహీర్ ఇక్బాల్ను సివిల్ కోర్టులో తన కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకుంది. అనంతరం ముంబైలోని బాస్టిన్లో గ్రాండ్ రిసెప్షన్ జరిగింది. అయితే ఆమె ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి సోనాక్షి సిన్హా వెళ్తోంది. అయితే సాధారణ ప్రయాణికుల మాదిరిగానే భద్రతా సిబ్బంది తనిఖీ చేశారు. సోనాక్షి వంతు వచ్చినప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఆమెను ఐడీ కార్డు చూపించమని అడిగారు. అనంతరం ఆమె కళ్లద్దాలు తీయమని అడిగారు. దీంతో ఆమె చిరునవ్వుతో సన్ గ్లాసెస్ తీసింది. వెంటనే ఆమెను గుర్తుపట్టి లోపలికి పంపించారు. ఆమె బ్లాక్ బ్లేజర్, బ్లూ జీన్స్, మ్యాచింగ్ బ్యాగ్, బ్లాక్ గ్లాసెస్ ధరించింది.
ప్రస్తుతం ఇందుకు సంభందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అయితే భద్రతా సిబ్బందిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా తనిఖీ చేయడం శెభాష్ అంటూ కొనియాడుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారమే సోనాక్షి బ్యాచిలర్ పార్టీ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా ఇన్స్ట్రాగామ్లో పంచుకుంది.