లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో, ‘కల్కి 2898 AD’ ఫేమ్ నాగ్ అశ్విన్ నిర్మాణంలో రూపొందిన సరికొత్త ప్రయోగాత్మక చిత్రం ‘సింగ్ గీతం’. అయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండేపూడి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వినూత్న చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన స్వరాలు అందించాడు. జూన్ 12న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియెన్స్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. రొటీన్ రెగ్యులర్ ఫార్మేట్ సినిమాల నుండి ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచింది. ఇప్పుడు ఈ మ్యూజికల్ ఫాంటసీ డ్రామా ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్లో సందడి చేసేందుకు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ వేదికగా ఈ రోజు నుంచే ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. సింగీతం శ్రీనివాసరావు మార్క్ మ్యాజిక్, నాగ్ అశ్విన్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాను విజువల్గా, మ్యూజికల్గా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లాయి. భిన్నమైన కథాంశంతో, అద్భుతమైన సంగీత నేపథ్యంతో తెరకెక్కిన ఈ ప్రయోగాత్మక చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకువస్తోంది నెట్ఫ్లిక్స్. డిజిటల్ వేదికపై కూడా ఈ చిత్రం మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

