Site icon NTV Telugu

నెక్స్ట్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్

Sharwanand to Play Police role again

టాలీవుడ్ విభిన్నతకు ప్రాధాన్యతనిచ్చే యువ నటులలో శర్వానంద్ ఒకరు. ఆయన కెరీర్ మొదటి నుంచి కమర్షియల్ చిత్రాలకు దూరంగా ఉంటూ, విభిన్నమైన కథనాలను ఎంచుకుంటూ టాలీవుడ్ తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. ఇక దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న యాక్షన్ ప్యాక్డ్ మాస్ ఎంటర్‌టైనర్ అయిన “మహా సముద్రంపై” ఈ హీరో ఆశలన్నీ పెట్టుకున్నారు. ఈ సినిమా తరువాత శర్వా హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో “ఆడవాళ్లు మీకు జోహార్లు” అనే సినిమా చేస్తున్నాడు మరియు ఈ ఏడాది చివరికల్లా ఈ ప్రాజెక్ట్ పూర్తవుతుంది.

Read Also : “ఆర్సీ15″లో హైలెట్ ఎపిసోడ్… ఆ సీన్లకే షాకింగ్ బడ్జెట్

ఓ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నప్పటికీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం శర్వానంద్ చాలామంది చిత్ర నిర్మాతలతో అప్పుడే చర్చలు జరుపుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ యంగ్ హీరో తన తదుపరి చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొరియోగ్రాఫర్ రాజు సుందరం దర్శకత్వంలో రూపొందనున్న సినిమాకు శర్వానంద్ ఓకే చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. వక్కంతం వంశీ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు. రాజు సుందరం, శర్వానంద్ గత కొన్ని సంవత్సరాలుగా ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు. దానికి సంబంధించిన చర్చను నేటికి ఓ కొలిక్కి వచ్చాయన్న మాట. ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. దసరాకు ఈ ప్రాజెక్ట్ విషయమై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Exit mobile version