సూపర్స్టార్ మహేశ్ బాబు, పరశురామ్ కాంబోలో రూపొందిన ‘సర్కారు వారి పాట’పై ఎన్ని అంచనాలు నెలకొన్నాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. విడుదలైన ప్రతీ పోస్టర్ ఎగ్జైట్ చేయడం, ముఖ్యంగా ట్రైలర్ ట్రైలర్లో వింటేజ్ మహేశ్ కనిపించడంతో.. ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మే 12వ తేదీ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్తో సినీ ప్రియులు ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.
ఇదిలావుండగా.. హైదరాబాద్లో యూసుఫ్గూడలో శనివారం రాత్రి ఘనంగా ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న ఈ చిత్రం, తాజాగా సెన్సార్ పనుల్ని ముగించుకుంది. సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా రన్టైమ్ 162 నిమిషాల 25 సెకన్లుగా తేలింది. ఈ సెన్సార్ రిపోర్ట్ని మేకర్స్ షేర్ చేస్తూ.. ‘‘మహేశ్ మెంటల్ మాస్ స్వాగ్ని వెండితెరపై చూస్తూ.. మీరు కురిపించే ప్రేమను ఆస్వాదించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం. థియేటర్లలో ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేసేందుకు సిద్ధంకండి’’ అని ట్వీట్ చేశారు.
కాగా.. ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించింది. సముద్రఖని, వెన్నెల కిశోర్, సుబ్బరాజ్, ఇంకా పేరుగాంచిన నటీనటులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు. తమన్ అందించిన సంగీతం ఆల్రెడీ బ్లాక్బస్టర్ అయ్యింది. మే 12న ఈ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో మహేశ్ అభిమానులకు రాసిన ఓ లేఖ నెట్టింట వైరల్ అవుతోంది. పోకిరి సమయంలోనూ మహేశ్ ఇలాంటి లేఖనే రాయడంతో, ఆ సినిమా తరహాలోనే సర్కారు వారి పాట బ్లాక్బస్టర్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
All set to embrace your immense love and support from May 12th 💝💫
Get ready to witness Super ⭐@urstrulyMahesh‘s MENTAL MASS SWAG in Theatres Worldwide ❤️🔥
Bookings opening in a phased manner across the board 🤗#SarkaruVaariPaata #SVP #SVPMania pic.twitter.com/0EFKRHlLMQ
— Mythri Movie Makers (@MythriOfficial) May 8, 2022
