Site icon NTV Telugu

మహేష్ సినిమాలో రాజకీయనాయకుడుగా సంజయ్ దత్

Sanjay Dutt to play key role in Mahesh Babu’s Next

ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ చిత్రంతో బిజీగా ఉన్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇందులో పూజా హేగ్డే హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే కె.జి.ఎఫ్‌ 2 లో అధీరాగా నటిస్తున్న సంజయ్ దత్ మహేశ్, త్రివిక్రమ్ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నాడట. రివేంజ్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక పవర్ ఫుల్ పొలిటీషియన్ గా కనిపిస్తాడట.

Read Also : రెండు పోనీటైల్స్ తో రణవీర్

ఇందులో నభా నటేష్ సెకండ్ హీరోయిన్ గా ఎంపికైందట. ఇదిలా ఉంటే ఈ సినిమాకి ‘పార్ధు’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. గతంలో మహేష్ – త్రివిక్రమ్ నటించిన ‘అతడు’లో హీరో పేరు కూడా ‘పార్థు’నే కావటం విశేషం. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతదర్శకుడుగా ఎంపికైనట్లు సమాచారం. దీపావళి తర్వాత షూటింగ్ మొదలు పెడతారట. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది.

Exit mobile version