ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసులో 25 కోట్ల డీల్… ఎన్సీబీ ముందుకు షారుఖ్ మేనేజర్, గోసావి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆర్యన్ ఖాన్ డ్రగ్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారిస్తున్న ఎన్సీబీ అధికారి వాఖండే ఆర్యన్ ను కేసు నుంచి తప్పించడానికి భారీగా డబ్బును డిమాండ్ చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆయనను కేసు నుంచి తొలగించారు. అప్పటి నుంచి ఈ కేసు పలు పలుపులు తిరుగుతోంది. అయితే డబ్బు రికవరీకి సంబంధించి సామ్ డిసౌజా అకా సెన్విల్లే స్టాన్లీ డిసౌజా నేడు ఎంసీబీ సిట్ ముందు హాజరు కానున్నారు. ఆర్యన్ ను కేసు నుంచి తప్పించడానికి షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీ… కిరణ్ గోసావిని 25 కోట్ల డీల్ కుదుర్చుకోవడానికి సంప్రదించినట్లు సామ్ ఆరోపించాడు. ఈ మేరకు కిరణ్ గోసావి, దద్లానీ నుంచి 50 లక్షల రూపాయల మనీ తీసుకున్నారని కూడా సామ్ ఆరోపించాడు. దీంతో ఈరోజు జరిగే విచారణలో ఆర్యన్ ఖాన్ కేసును క్లోజ్ చేసేందుకు షారుఖ్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో అలాంటి ఒప్పందం ఏదైనా జరిగిందా ? అని సామ్ డిసౌజా నుండి ఎన్సీబీ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది. గతంలో రెండు సార్లు సామ్కు సిట్ సమన్లు పంపినా హాజరు కాలేదు.
Read Also : కేబీఆర్ పార్క్ లో సినీ నటిపై దాడి
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
ఆర్యన్ డ్రగ్స్ కేసు సహా 6 కేసులను ఎన్సీబీ సిట్ విచారిస్తోంది. దీనికి సంబంధించి శామ్ డిసౌజాను కూడా విచారించనున్నారు. సిట్ సమన్ల ప్రకారం సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య హాజరు కావాలని సామ్ను కోరింది. నిజానికి ఈ విషయంలో ప్రభాకర్ సాయిల్ తర్వాత శామ్ డిసౌజా ప్రకటన చాలా కీలకం. వాస్తవానికి ఆర్యన్ ఖాన్ను ఈ కేసు నుండి తప్పించడానికి ప్రత్యక్ష సాక్షి కిరణ్ గోసావి డబ్బు వసూలు చేస్తున్నాడని సామ్ ఇటీవల పేర్కొన్నాడు. అతను షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో 18 కోట్ల డీల్ చేశాడు. ఈ విషయంలో ఎన్సిపి సభ్యుడైన సునీల్ పాటిల్, గోసావికి సపోర్ట్ ఇస్తున్నారని సామ్ డిసౌజా చెప్పుకొచ్చాడు.
గోసావి, సామ్ మధ్య ఒప్పందం
కొన్ని రోజుల క్రితం కిరణ్ గోసావికి బాడీ గార్డ్ ప్రభాకర్ సెయిల్, గోసావి, సామ్ డిసౌజా మధ్య జరిగిన ఫోన్ సంభాషణను తాను విన్నానని పేర్కొన్నాడు. ఆర్యన్ ఖాన్ కేసును క్లోజ్ చేసేందుకు 25 కోట్ల డీల్ కుదుర్చుకోవాలని గోసావి సామ్ను అడిగాడు. అప్పుడు గోసావి ఈ డీల్ను 18 కోట్లకు ఫిక్స్ చేయమని కోరాడు. షారుక్ ఖాన్ మేనేజర్ పూజా దద్లానీతో ఈ డీల్ చేయమని గోసావి సామ్ని అడిగాడు. 18 కోట్లలో 8 కోట్లు సమీర్ వాంఖడేకి ఇవ్వాల్సి ఉంటుందని గోసావి అనడం ప్రభాకర్ విన్నాడట. ఈరోజు జరిగే విచారణలో ఏం బయట పడుతుందో చూడాలి.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!