వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై రాజమౌళి కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో తెరకెక్కుతున్న బాలీవుడ్ మూవీ ‘బ్రహ్మాస్త్ర’ ప్రెస్ మీట్ ఈరోజు ఉదయం హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమౌళి మాట్లాడుతూ వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా… అంటూ ‘బ్రహ్మాస్త్ర’ డైరెక్టర్ పై కామెంట్స్ చేశారు. ఈ సినిమా గురించి అయాన్ నన్ను కలిసి మూడేళ్లు అవుతోంది. కరణ్ జోహార్ ఒకరోజు నాకు ఫోన్ చేసి ‘బ్రహ్మాస్త్ర’ అనే సినిమా చేస్తున్నాము. డైరెక్టర్ అయాన్ మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. తరువాత ఆయన వచ్చి కలిశాడు. ఆయన నాకు సినిమా గురించి 20 నిముషాలు చెప్పగానే వీడెవడో నాకన్నా పిచ్చోడు అనుకున్నా…
Read Also : ఏది పడితే అది తీస్తే పాన్ ఇండియా అవ్వదు : రాజమౌళి
Also Read
ఆయన సినిమాల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నాడు. ఒక్క సినిమా గురించి చాలా టైం స్పెండ్ చేశాడు. నాకు సినిమాల విషయంలో ఎంత పిచ్చి ఉందో ఆయనకు అంతకన్నా ఎక్కువగా ఉంది. తాను చెప్తుంటే ఒక బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడని అన్పించింది. ఆయన కారణంగానే ఈ సినిమా టీంతో అసోసియేట్ అవ్వాలని డిసైడ్ అయ్యాను” అంటూ డైరెక్టర్ గురించి ఓ రేంజ్ లో చెప్పుకొచ్చారు రాజమౌళి. కాగా ఒక సూపర్హీరో చుట్టూ తిరిగే ప్రతిష్టాత్మకమైన సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘బ్రహ్మాస్త్ర’లో రణబీర్, అలియా, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించారు. సౌత్ సూపర్ స్టార్ నాగార్జున, ప్రముఖ నటి డింపుల్ కపాడియా, మౌని రాయ్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..