Site icon NTV Telugu

Padma Awards 2022 : రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అందుకున్న సోనూ నిగమ్‌

న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుక – పార్ట్ IIలో, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 2022కి పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. సంగీత, వినోద ప్రపంచంలోని ప్రముఖులు పద్మ విభూషణ్ ను అందుకున్నారు. ప్రముఖ బాలీవుడ్ గాయకుడు సోనూ నిగమ్ అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ అవార్డును మార్చి 28న అందుకున్నారు. ప్రముఖ బెంగాలీ నటుడు విక్టర్ బెనర్జీకి పద్మభూషణ్ అవార్డు లభించింది. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా వీరికి సన్మానం జరిగింది. సోనూ నిగమ్‌తో పాటు సంగీతకారుడు బల్లేష్ భజంత్రీ, గాయని మాధురీ బర్త్వాల్, చిత్రనిర్మాత చంద్రప్రకాష్ ద్వివేదిలకు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు లభించింది. విక్టర్ బెనర్జీతో పాటు ఉస్తాద్ రషీద్ ఖాన్, దివంగత గాయకుడు గుర్మీత్ బావాలకు ఈ ఏడాది పద్మభూషణ్ అవార్డు లభించింది.

Read Also : Will Smith : సిగ్గుపడుతున్నాను అంటూ బహిరంగ క్షమాపణ

128 పద్మ అవార్డుల జాబితాలో నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ప్రకటించింది. మొత్తం 107 మంది ప్రముఖులను పద్మశ్రీతో సత్కరించారు. అవార్డు గ్రహీతలలో 34 మంది మహిళలు, Foreigners/NRI/PIO/OCI వర్గం నుండి 10 మంది వ్యక్తులు, 13 మంది మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు. నేను మార్చి 21న జరిగిన సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకలో రాష్ట్రపతి రెండు పద్మవిభూషణ్, ఎనిమిది పద్మభూషణ్ మరియు 54 పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. అవార్డు గ్రహీతలలో శాస్త్రీయ గాయకుడు రషీద్ ఖాన్ పద్మ విభూషణ్ అందుకున్నారు. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలతో ఒకటైన పద్మ అవార్డులను కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వాణిజ్యం అండ్ పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, పౌర సేవ వంటి అనేక విభాగాలలోని ప్రముఖులకు అందజేశారు.

Exit mobile version