NTV Telugu Site icon

Rakshana : ఓటీటీలోకి రాబోతున్న పాయల్ క్రైమ్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

Rakshana

Rakshana

టాలీవుడ్ హాట్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన మొదటి సినిమాతోనే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.. ఆ తర్వాత వరుస ప్లాపులు పలకరించిన తగ్గేదేలే అన్నట్లు వరుస సినిమాలు చేసింది.. గతంలో వచ్చిన మంగళవారం సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుంది.. ఆ తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రక్షణ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా కూడా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అవుతుంది..

ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కులను ఆహా ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో విడుదలైన 15 రోజుల్లోనే ఈ మూవీ ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. జూన్ 21 నుంచి రక్షణ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తుంది.. త్వరలోనే రిలీజ్ ను ఆహా తన అధికారిక సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించనుంది…

ఇకపోతే డైరెక్టర్, నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు పాయల్ రాజ్‌పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఆద్యంతం కట్టిపడేసేలా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ సినిమాలో పాయల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించింది.. ఇక ఈ సినిమాలో మానస్‌, రాజీవ్ కనకాల, వినోద్ బాల, శివన్నారాయణ తదితరులు నటించారు. హరిప్రియ క్రియేషన్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహతి సంగీతాన్ని అందించారు..