Paruchuri Gopala Krishna: మొదట్లో ‘ఇంద్ర’ వద్దన్నారు.. తర్వాత అలా సెట్టయ్యింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paruchuri Gopala Krishna Recalls Indra Movie Days: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. థియేట్రికల్ రన్, కలెక్షన్ల పరంగా ఆ చిత్రం ఎన్నో రికార్డుల్ని నమోదు చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఓ చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి సినిమాను మొదట చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ నిర్ణయించుకున్నారట. నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ చిత్రం చేసేందుకు సముఖత వ్యక్తం చేయలేదట! చివరికి తాను జోక్యం చేసుకోవడంతో, ఈ సినిమా కార్యరూపం దాల్చుకుందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ‘ఇంద్ర’ సినిమా వచ్చి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆయన ఈ చిత్రం కోసం కొన్ని విశేషాలను తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నారు.
‘‘ఇంద్ర సినిమా చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ మొదట్లో అనుకున్నారు. అందుకు కారణం.. ఆయన తెరకెక్కించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్రని ఇంద్ర రోల్ పోలి ఉండటమే! కాబట్టి.. మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని దర్శకుడు భయపడ్డాడే తప్ప, కథ బాలేదని వెనకడుగు వేయలేదు. ఆయనతో పాటు నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పుడు నేను చిరంజీవి ఓ అద్భుతమైన సినిమా మిస్ అయిపోతున్నారే.. అని బాధపడ్డా. అయితే.. ఈ సినిమా విషయం చిరంజీవికి చెప్పాను. అప్పుడాయన గోపాల్ అశ్వినీదత్ లేకుండానే, చిన్నికృష్ణతో వచ్చి నాకు కథ చెప్పండి అన్నారు. కథ చెప్తున్నప్పుడు.. ఇంటర్వెల్ వరకూ విని, లేచి కిళ్లీ వేసుకొని వచ్చారు. ‘సెకండాఫ్ వినక్కర్లేదు, ఇది హిట్ అవుతుంది’ అని చిరంజీవి అన్నారు. కథ పూర్తయ్యేసరికి.. పక్క గదిలో నుంచి అశ్వినీదత్, బీ. గోపాల్ వచ్చారు. అందరం కలిసి చేద్దామన్నారు. అలా ఈ సినిమా సెట్ అయ్యింది’’ అని నాటిరోజుల్ని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
Also Read
అంతేకాదు.. తనకు ఈ చిత్రంలో తనికెళ్ల భరణి పోషించిన పాత్ర ఆఫర్ వచ్చిందని, కానీ మోకాలి నొప్పి కారణంగా అంత దూరం ప్రయాణం చేయలేక తానే వదిలేసుకున్నానని గోపాలకృష్ణ తెలిపారు. అలాగే డైలాగ్స్ రైటర్ అయిన తాను మూగపాత్రలో నటిస్తే జనాలు ఆదరిస్తారా? అని ఆలోచించుకొని, మూగపాత్ర ఎందుకులే అని చేయలేదని అన్నారు. అలా తాను ఇంద్రలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం చేజార్చుకున్నానన్నారు. ఆ సినిమాలో తాము రాసిన ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్ ఇప్పటికీ మారిమోగిపోతూనే ఉందని, అది తనకు చాలా సంతోషకరంగా అనిపిస్తుందని పరచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
King100: నాగార్జున ‘కింగ్ 100’లో మరో స్టార్ హీరోయిన్.. ఐశ్వర్య రాజేష్ ఎంట్రీ కన్ఫర్మ్!
-
India’s New Time Rule: ISTపై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. దేశవ్యాప్తంగా కొత్త టైమ్ రూల్స్.. ఎప్పటినుంచంటే?
-
Billionaire Web Series: విజయ్ మాల్యా కథతో అర్జున్ రాంపాల్.. నవంబర్లో షూటింగ్
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
ట్రెండింగ్
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!