Paruchuri Gopala Krishna: మొదట్లో ‘ఇంద్ర’ వద్దన్నారు.. తర్వాత అలా సెట్టయ్యింది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Paruchuri Gopala Krishna Recalls Indra Movie Days: మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఇంద్ర’ సినిమా అప్పట్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. థియేట్రికల్ రన్, కలెక్షన్ల పరంగా ఆ చిత్రం ఎన్నో రికార్డుల్ని నమోదు చేసింది. టాలీవుడ్ చరిత్రలోనే ఓ చెరగని ముద్ర వేసుకుంది. అలాంటి సినిమాను మొదట చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ నిర్ణయించుకున్నారట. నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ చిత్రం చేసేందుకు సముఖత వ్యక్తం చేయలేదట! చివరికి తాను జోక్యం చేసుకోవడంతో, ఈ సినిమా కార్యరూపం దాల్చుకుందని ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు. ‘ఇంద్ర’ సినిమా వచ్చి 20 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా.. ఆయన ఈ చిత్రం కోసం కొన్ని విశేషాలను తన యూట్యూబ్ ఛానెల్లో పంచుకున్నారు.
‘‘ఇంద్ర సినిమా చేయకూడదని దర్శకుడు బీ. గోపాల్ మొదట్లో అనుకున్నారు. అందుకు కారణం.. ఆయన తెరకెక్కించిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడులోని హీరోల పాత్రని ఇంద్ర రోల్ పోలి ఉండటమే! కాబట్టి.. మళ్లీ అలాంటి సినిమానే చేస్తే ఏమవుతుందోనని దర్శకుడు భయపడ్డాడే తప్ప, కథ బాలేదని వెనకడుగు వేయలేదు. ఆయనతో పాటు నిర్మాత అశ్వినీదత్ సైతం ఈ సినిమా చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. అప్పుడు నేను చిరంజీవి ఓ అద్భుతమైన సినిమా మిస్ అయిపోతున్నారే.. అని బాధపడ్డా. అయితే.. ఈ సినిమా విషయం చిరంజీవికి చెప్పాను. అప్పుడాయన గోపాల్ అశ్వినీదత్ లేకుండానే, చిన్నికృష్ణతో వచ్చి నాకు కథ చెప్పండి అన్నారు. కథ చెప్తున్నప్పుడు.. ఇంటర్వెల్ వరకూ విని, లేచి కిళ్లీ వేసుకొని వచ్చారు. ‘సెకండాఫ్ వినక్కర్లేదు, ఇది హిట్ అవుతుంది’ అని చిరంజీవి అన్నారు. కథ పూర్తయ్యేసరికి.. పక్క గదిలో నుంచి అశ్వినీదత్, బీ. గోపాల్ వచ్చారు. అందరం కలిసి చేద్దామన్నారు. అలా ఈ సినిమా సెట్ అయ్యింది’’ అని నాటిరోజుల్ని గోపాలకృష్ణ గుర్తు చేసుకున్నారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
అంతేకాదు.. తనకు ఈ చిత్రంలో తనికెళ్ల భరణి పోషించిన పాత్ర ఆఫర్ వచ్చిందని, కానీ మోకాలి నొప్పి కారణంగా అంత దూరం ప్రయాణం చేయలేక తానే వదిలేసుకున్నానని గోపాలకృష్ణ తెలిపారు. అలాగే డైలాగ్స్ రైటర్ అయిన తాను మూగపాత్రలో నటిస్తే జనాలు ఆదరిస్తారా? అని ఆలోచించుకొని, మూగపాత్ర ఎందుకులే అని చేయలేదని అన్నారు. అలా తాను ఇంద్రలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం చేజార్చుకున్నానన్నారు. ఆ సినిమాలో తాము రాసిన ‘మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా’ అనే డైలాగ్ ఇప్పటికీ మారిమోగిపోతూనే ఉందని, అది తనకు చాలా సంతోషకరంగా అనిపిస్తుందని పరచూరి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!