NTV Telugu Site icon

ప్రభాస్ ఎవరో నాకు తెలియదు.. నిత్యామీనన్ షాకింగ్ కామెంట్స్

nithya menon

nithya menon

‘అలా మొదలయ్యింది’ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైన ముద్దుగుమ్మ నిత్యామీనన్.. సౌందర్య తరువాత సౌందర్య అని పేరుతెచ్చుకున్న ఈ భామ గ్లామరస్ రోల్స్ కాకుండా పాత్రకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ లోనే కనిపించి మెప్పించింది. ఇటీవలే నిర్మాతగా మారి స్కైలాబ్ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్న నిత్యా ప్రస్తుతం భీమ్లా నాయక్ లో పవన్ సరసన నటిస్తోంది. ఇక తాజాగా ఆమె పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎదుర్కొన్న కొన్ని చేదు అనుభవాలను అభిమానులతో పంచుకుంది. తనపై కొంతమంది జర్నలిస్టులు లేనిపోని వార్తలు రాశారని , వాటిని చూసి చాలా కృంగిపోయానని చెప్పుకొచ్చింది.

“అలా మొదలయ్యింది సినిమా విడుదల తరువాత నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను . అక్కడ నన్ను ప్రభాస్ గురించి అడిగారు.. ఆ సమయంలో ప్రభాస్ ఎవరో నాకు తెలియదు .. అదే వాళ్లకు చెప్పాను .. ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని అంగన్ వారందరు షాక్ అయ్యి.. నన్ను ఆట పట్టించారు.. అల్లరి చేశారు.. ఇంత చిన్న విషయాన్ని పెద్దదిగా చేస్తూ ఒక జర్నలిస్ట్ నా గురించి తప్పుగా రాశారు.. నా గురించి ఓ జర్నలిస్ట్ అలా రాయడంతో చాలా హర్ట్ అయ్యాను. మానసికంగా చాలా కుంగిపోయాను” అంటూ చెప్పుకొచ్చింది. ఆ సమయంలో నిత్యాపై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.