NTV Telugu Site icon

Waltair Veerayya: ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక మారింది…

Waltair Veerayya

Waltair Veerayya

నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ‘వీర సింహా రెడ్డి’ ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి ఒంగోల్ లోని ‘ఏబీఏం కాలేజ్ గ్రౌండ్స్’ లో జరగాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఇబ్బందులు రావడంతో ‘అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్స్’కి మార్చారు. వీర సింహా రెడ్డి దారిలో నడుస్తూ మెగస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘వాల్తేరు వీరయ్య’ ప్రీరిలీజ్ ఈవెంట్ వేదికని కూడా మేకర్స్ మార్చారు. జనవరి 8న ఆర్కే బీచ్ లో జరగాల్సిన ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం ఏర్పాట్లు గత కొన్ని రోజులుగా జరుగుతున్నాయి. అయితే అధికారుల సూచన మేరకు ఆర్కే బీచ్ నుంచి ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని చెయ్యడానికి నిర్వాహకులు సిద్ధమయ్యారు. చిరు, రవితేజ లాంటి స్టార్ హీరోలు రానున్న ఈవెంట్ అంటే అది ఎంత గ్రాండ్ గా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైత్రీ మూవీ మేకర్స్ ప్రభుత్వంతో తలనొప్పి ఎందుకు అనుకుందో ఏమో కానీ మారింది ప్లేసులే కదా ఊర్లు కాదు కదా అనుకోని రెండు సినిమాల ప్రీరిలీజ్ ఈవెంట్స్ ని అధికారులు సూచించిన చోటే చేసేస్తున్నారు.

ఆర్కే బీచ్ లో వాల్తేరు వీరయ్య ప్రీఈవెంట్ వేదిక దాదాపు పూర్తియిన తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ అధికారాలు వేదిక మార్చమని చెప్పడం నిర్వాహకులకి ఖర్చుని పెంచే విషయమే. ఇదిలా ఉంటే ప్రీరిలీజ్ ఈవెంట్ కి సెక్యూరిటీగా వచ్చే బందోబస్తు పోలీసులకి ఒక రోజు జీతం, 5000 కార్లు మాత్రమే పార్కింగ్ అంటూ కొన్ని నిబంధనలని ఏపీ అధికారులు పెడుతున్నారు అనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఎంతవరకూ నిజం ఉందో తెలియదు కానీ ఆంధ్రాలో సినిమా ఈవెంట్స్ చెయ్యండి, షూటింగ్స్ చెయ్యండి, స్టూడియోలు పెట్టండి అనే నాయకులు అందుకు తగ్గ వాతావరణాన్ని కూడా మైంటైన్ చెయ్యాల్సి ఉంటుంది అనే విషయాన్ని గుర్తించాలి. అప్పుడే చిత్ర పరిశ్రమ ఏపీలో సినిమా పనులు చేసుకోగలదు లేదంటే చిత్ర పరిశ్రమ ఎప్పటికీ తెలంగాణా వరకే పరిమితం అవుతుంది ఎందుకంటే ఇక్కడి ప్రభుత్వం సినిమాకి సంబంధించిన పనులకి కొన్ని ప్రత్యేక సదుపాయాలు కలిపిస్తుంది.