Malvi Malhotra lodging a complaint against Lavanya: సినిమా రేంజ్ ట్విస్ట్లతో రాజ్తరుణ్ – లావణ్యల వ్యవహారం పూట పూటకు కొత్త అంశాలతో ఆసక్తి రేకెత్తిస్తోంది. తనను ప్రేమించి రాజ్తరుణ్ మోసం చేసాడని, పెళ్లి చేసుకోమని అడిగినందుకు చంపుతానని బెదిరిస్తున్నాడని, మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్తో రాజ్తరుణ్కు సంబంధం ఉందని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని అప్పుడు రాజ్ తరుణ్ అండగా నిలబడలేదని నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది లావణ్య. ఇక ఈ కేసులో మాన్వి మల్హోత్రా అనే హీరోయిన్ ప్రమేయం ఉందని ఆమె తనను కాల్స్ చేసి కూడా బెదిరించిందని ఆమె ఆరోపంచింది. లావణ్యపై రాజ్ తరుణ్ సంచలన ఆరోపణలు చేశాడు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉంది, వద్దని వారించినందుకు తనతో గొడవ పడింది.
Tollywood: టాలీవుడ్లో విషాదం.. లేడీ యువ నిర్మాత ఆత్మహత్య.. పురుగులు పట్టేసిన స్థితిలో శవం?
గతంలో ఓ సారి డ్రగ్స్ కేసులో కూడా అరెస్ట్ అయింది అని అన్నారు. లావణ్య తనకు ఆన్ లైన్లో పరిచయం అయిందని, హీరోగా ప్రయత్నాలు చేస్తున్న రోజుల్లో సహాయం చేసింది, అంతే తప్ప ఆమెతో నాకు ఎటువంటి ఫిజికల్ రిలేషన్ లేదని అన్నారు. లావణ్య మస్తాన్ సాయి వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిపడమే కాక తనకు ఉన్న స్నేహంతోనే మాల్వి మల్హోత్రా ఆమెతో మాట్లాడిందని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో మాన్వి మల్హోత్రా ఇంకా మీడియా ముందుకు రాలేదు. ఇక ఇప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆమె ఈరోజు సాయంత్రం గచ్చిబౌలిలో ఉన్న సైబరాబాద్ పోలీసు స్టేషన్లో లావణ్య మీద ఫిర్యాదు చేయనుంది. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తిరగబడరా సామీ అనే సినిమా చేశారు. ఆమె పరిచయం అయ్యాకే తనను రాజ్ దూరం పెట్టాడని ఆమె మాయలో పడి రిలేషన్ లోకి వేళ్ళాడని లావణ్య ఫిర్యాదులో ఆరోపించింది.