యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ. మరో రెండు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ సందర్భంగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెల్లడించారు. మెగా హీరో సాయి దుర్గా తేజ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘సంబరాల ఏటి గట్టు’ మొదట కిరణ్ అబ్బవరం చేయాల్సి ఉందట. అయితే కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ను తను వదులుకోవాల్సి వచ్చిందట.
కిరణ్ మాట్లాడుతూ ‘ దర్శకుడు రోహిత్ కేపీ ‘ఎస్ ఆర్ కళ్యాణమండపం’ సినిమా రోజుల నుంచే మంచి మిత్రుడు. కథా చర్చల సమయంలో మొదట కేవలం రూ. 2 కోట్ల బడ్జెట్లో పూర్తి చేసే ఒక చిన్న సినిమా కథ గురించి చెప్పాడు. అయితే తను కొంచెం పెద్ద స్కేల్ ఉన్న విభిన్నమైన సబ్జెక్ట్ అడగడంతో ‘సంబరాల ఏటి గట్టు’ కథ చెప్పాడు.ఈ కథ విన్న తర్వాత బడ్జెట్ క్రమంగా పెరుగుతూ రూ. 70 కోట్ల నుంచి రూ. 80 కోట్ల వరకు వెళ్లేలా కనిపించింది. ఆ సమయంలో నా సినిమాలు సరిగ్గా ఆడలేదు, వరుస ప్లాప్స్ వచ్చాయి. నా మార్కెట్ పరిమితికి అంత భారీ బడ్జెట్ పెట్టి సినిమా తీయడం నిర్మాతలకు రిస్క్ అవుతుంది. అందుకే నా అంతట నేనే కాస్త వెనక్కి తగ్గి ఈ సినిమా వద్దు అని చెప్పేశాను. ఆ సినిమాను సాయి అన్న చేస్తుండం చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా హిట్ అయ్యే సినిమా’ అని అన్నారు.

