బిపిన్ రావత్ మృతికి అగౌరవం అంటూ డైరెక్టర్ షాకింగ్ డెసిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారనే వార్త దేశంలో ప్రకంపనలు సృష్టిస్తే, కొందరు మాత్రం అగౌరవంగా స్పందించడాన్ని ఖండిస్తూ కేరళ సినీ దర్శకుడు అలీ అక్బర్ తనకు మతంపై నమ్మకం పోయిందని, తన భార్యతో కలిసి హిందూ మతంలోకి మారతానని అన్నారు. అంతకుముందు ఒక వీడియోలో జనరల్ బిపిన్ రావత్ మరణం గురించి పోస్ట్లపై నవ్వుతూ ఎమోజీలతో స్పందించిన వారి పట్ల అలీ అక్బర్ తన ధిక్కారాన్నిఅసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ మేరకు మతంపై తనకు నమ్మకం పోయిందని బుధవారంనాడు ప్రకటించాడు. అంతేకాదు తాను ఇకపై ముస్లింగా ఉండబోనని, హిందువుగా మారతానని స్పష్టం చేశారు. ఇప్పుడు అక్బర్, ఆయన భార్య లూస్యమ్మ హిందువులుగా మారబోతున్నారు. అలీ అక్బర్ ఇప్పుడు రామసింహన్గా మారబోతున్నాడు. “రామసింహన్ కేరళ సంస్కృతికి కట్టుబడి హత్యకు గురైన వ్యక్తి… ఇప్పుడు అలీ అక్బర్ని రామ్ సింగ్ అని పిలుస్తారు. అది మంచి పేరు” అన్నాడు. రామసింహన్ కుటుంబం ఇస్లాం నుండి హిందూ మతంలోకి మారాక 1947లో హత్యకు గురయ్యారు.
Read Also : కూలెస్ట్ డైరెక్టర్ గా రాజమౌళి… లిస్ట్ లో ఏకైక భారతీయుడు జక్కన్నే !
Also Read
- M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
- M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
- Censor: సినిమా రీ-ఎడిటింగ్కు సెన్సార్ బోర్డు చెక్: నిబంధనల్లో కీలక మార్పులు?
- Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
జనరల్ రావత్ మరణ వార్తపై అవమానకరమైన ప్రతిచర్యలు రావడంతో అలీ అక్బర్ తన ఫేస్బుక్ ఖాతాను డీయాక్టివేట్ చేశారు. తన మతానికి చెందిన వ్యక్తుల నుంచి ఈ మూర్ఖత్వ చర్య మతం మారాలని నిర్ణయించునెంతలా ఆయనను ప్రభావితం చేసింది. పేస్ బుక్ కొత్త ఖాతా ఓపెన్ చేసి ద్వారా ఈ ప్రకటన చేశాడు ఆయన. అలాగే తన కూతుళ్లను మతం మారమని బలవంతం చేయనని, అది వారి ఇష్టానికే వదిలేస్తానని చెప్పాడు. అలీ అక్బర్ గతంలో బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పార్టీ నాయకత్వంతో విభేదాల కారణంగా పదవికి రాజీనామా చేశారు. అక్బర్ 20కి పైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన 1988 లో ఉత్తమ తొలి దర్శకుడిగా కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డును కూడా అందుకున్నారు.
తాజావార్తలు
-
22A Lands: 22A భూములపై గుడ్ న్యూస్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన.!
-
Plastic Notes: ప్లాస్టిక్ నోట్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎప్పటి నుంచి అమల్లోకి వస్తాయంటే..
-
Arunachal Pradesh: ‘‘అరుణాచల్ ప్రదేశ్ మాదే’’.. చైనా అభ్యంతరాలపై భారత్ స్ట్రాంగ్ రిఫ్లై..
-
Raghunandan Rao: తెలంగాణలో రూ.200 కోట్ల సోలార్ స్కామ్.?.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
-
Pocharam Srinivas Reddy: పోచారం సంచలన వ్యాఖ్యలు.. రేవంత్పై ఫైర్, బాన్సువాడలో మళ్లీ మనమే
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..