చిత్ర పరిశ్రమ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం.. ఇక్కడ గ్లామర్ ఉన్నన్ని రోజులు మాత్రమే అవకాశాలు ఉంటాయి.. పేరు ఉంటుంది.. డబ్బు ఉంటుంది. అందుకే ఆ గ్లామర్ కోసం హీరోయిన్లు పడే కష్టం అంతా ఇంతా కాదు. డైటింగ్, వర్క్ అవుట్స్ తో పాటు సర్జరీలు చేయించుకొని మరీ అందాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవలే ఒక నటి సర్జరీ వికటించడంతో మృతిచెందిన విషయం విదితమే.. తాజగా మరో నటికి సర్జరీ వికటించి ముఖం మొత్తం వాచిపోయి గుర్తుపట్టలేని స్థితికి మారిపోయింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. స్వాతి సతీష్ కన్నడలో హీరోయిన్ గా పలు చిత్రాల్లో కనిపించింది.
ఇక ఇటీవలే ఆమె తన అందాన్ని మెరుగుపరుచుకోవడానికి ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రూట్ కెనాల్ థెరపీ చేయించుకొంది. అయితే ఆ సర్జరీ కాస్తా వికటిచడంతో ఆమె ముఖం అంతా వాచిపోయింది. ఆ ముఖం వాపు రెండు మూడు రోజుల్లో నయమవుతుందని వైద్యులు తెలిపారు. అయితే మూడు వారాలు అయినా ముఖం వాపు తగ్గలేదు. ముఖం వాపు తగ్గగ పోగా తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఆమె ముఖం ఉబ్బిన కారణంగా దాదాపుగా ఆమెను ఎవరు గుర్తించలేని పరిస్థితి అని చెప్పొచ్చు. ఆ ముఖంతో తన ఇంటి నుండి బయటకు వెళ్లడం కష్టంగా ఉందని, తనకు వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్లిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆమెకు సర్జరీలో భాగంగా అనస్థీషియాకు బదులుగా సాలిసిలిక్ యాసిడ్ ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్లడంతో ఆమెకు ఈ విషయం తెలిసింది. ఈ విషయం తెలియడంతో ఆమె కోలుకున్నాక సదురు హాస్పిటల్ పై మరియు డాక్టర్ పై కేసు వేయనున్నట్లు తెలుస్తోంది.
