NTV Telugu Site icon

Kangana Ranaut: ‘మా’ ప్రెసిడెంట్ కు థాంక్స్ చెప్పిన బాలీవుడ్ ఫైర్ బ్రాండ్.. ఎందుకంటే..?

Kangana

Kangana

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. నేడు బుద్ధ పూర్ణిమ కావడం, ఆమె నటించిన ‘ధాకడ్’ సినిమా రిలీజ్ కు సిద్దమవుతుండడంతో సినిమా విజయం అందుకోవాలని శ్రీవారిని దర్శించుకోని ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధప్రసాదాలు అందజేసారు. ఇక ఈ విషయాన్నీ కంగనా తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది.

“ఈరోజు బుద్ధపూర్ణిమ కావడంతో నేను, ‘ధాకడ్’ చిత్ర నిర్మాత దీపక్ ముఖత్ , అతని సతీమణి కృష్ణ ముఖత్ తో పాటు చిత్రబృందంలోని కొంతమంది కలిసి శ్రీవారిని దర్శించుకున్నాం. తిరుమల దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేసిన మా అధ్యక్షుడు మంచు విష్ణుకు, ధర్మారెడ్డి గారికి స్పెషల్ థాంక్స్” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపొయితే కంగనా నటించిన ‘ధాకడ్’ సినిమా మే 20 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీష్‌ ఘయ్‌ దర్శకత్వం వహించిన ‘ధాకడ్‌’ మూవీలో కంగనా రనౌత్‌ ఏజెంట్‌ అగ్నిగా నటించింది. అసెలం ఫిలిమ్స్, సోహం రాక్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్, సోహెల్ మక్లాయి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, దివ్యా దత్తా, సస్వత ఛటర్జీ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మరి ఈ సినిమాతో ఫైర్ బ్రాండ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.