పిరికిపంద చర్య… కేంద్రంపై కంగనా ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దాదాపు ఏడాది కాలంగా ప్రజలు నిరసన వ్యక్తం చేసిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి మోడీ నిన్న ప్రకటించారు. ఈ నెలాఖరులో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగబద్ధంగా రద్దు ప్రక్రియను పూర్తి చేయనుంది. మోడీ తీసుకున్న నిర్ణయంపై సామాన్య ప్రజలతో పాటు పలువురు సెలెబ్రిటీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సినీ ప్రపంచానికి చెందిన పలువురు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే కంగనా మాత్రం మోడీ తీసుకున్న నిర్ణయాన్ని సిగ్గు చేటు, పిరికిపంద చర్యగా అభివర్ణిస్తూ ఫైర్ అయ్యింది కంగనా.
Read Also : “తలపతి 66” స్టోరీ లైన్ ఇదే ?
Also Read
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
- Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
- Viswanath & Sons: 16 రోజులైనా తగ్గని జోరు.. రూ.240 కోట్ల క్లబ్లోకి సూర్య సినిమా
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కంగనా ‘ఇది విచారకరం, సిగ్గుచేటు, తప్పు’ అని రాసింది… “ఎంచుకున్న ప్రభుత్వం పార్లమెంటులో కూర్చుంటే, వీధుల్లో కూర్చున్న వారు చట్టాలు చేయడం ప్రారంభిస్తే ఇది కూడా జిహాదీ దేశమే… అభినందనలు ఇది చేస్తునం వారందరికీ” అంటూ ఘాటు పోస్ట్ చేసింది. అంతేకాదు ఆనంద్ రంగనాథన్ ట్వీట్ను కంగనా తన కథనంలో పెట్టింది. ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. “ఆశ్చర్యకరంగా ఇది పిరికిపంద చర్య… దేశ ప్రగతికి పరాజయం. ప్రతిపక్షాల మాదిరిగానే నరేంద్ర మోదీ కూడా దేశాన్ని దశాబ్దాల వెనక్కి తీసుకెళ్తున్నారు. భారత్ ఓడిపోయింది. అరాచకం విజయం సాధిస్తుంది. గడ్డు రోజులు వస్తున్నాయి” అంటూ ఆ పోస్టులో ఉంది.
మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. “నేనేం చేసినా రైతుల కోసమే చేశాను.. నేను చేసేది దేశం కోసమే.. మీ ఆశీర్వాదంతో నా కష్టాన్ని ఏనాడూ వదలలేదు.. ఈ రోజు నేను మీకు భరోసా ఇస్తున్నాను. నేను ఇప్పుడు మరింత కష్టపడి పని చేస్తాను. తద్వారా మీ కలలు, దేశం కలలు సాకారమవుతాయి. మేము మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలలో ప్రక్రియను ప్రారంభిస్తాము” అని ప్రధాని మోదీ చెప్పారు.

తాజావార్తలు
-
Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. 7 బంతుల్లో 3 వికెట్లు, టీ20లో నంబర్-1 బౌలర్గా..
-
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
-
Brad Pitt : ఏంజెలీనా జోలీని వివాహం చేసుకోవడమే నా జీవితంలో అతిపెద్ద తప్పు
-
Veligonda Project: నేడే సీఎం చంద్రబాబు చేతులమీదుగా వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభం.!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్.. హల్ద్వానీ ‘శుద్ధీకరణ’ వివాదంలో కేసు నమోదు
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!