టాలీవుడ్లోకి కపూర్ ఫ్యామిలీ నుండి మరో బ్యూటీ ఎంట్రీ తీసుకోబోతుంది. ఇప్పటికే బాలీవుడ్లో తెరంగేట్రం చేసిన స్టార్ కిడ్ అక్కడ సరైన ఐడెంటిటీ రాకపోవడంతో తెలుగు గుమ్మం టచ్ చేయబోతుంది. కపూర్ ఫ్యామిలీ నుండి జెన్ జీ కిడ్స్ ఒక్కొక్కరుగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేస్తున్నారు. ఇప్పటికే బోణి కపూర్ కూతురు జాన్వీ కపూర్ తెలుగులో ఫేమ్ తెచ్చుకోగా నెక్ట్స్ నేనే అంటోంది జాన్వీ కజిన్ శనాయ కపూర్.
శనాయ, బోనీ బ్రదర్ సంజయ్ కపూర్ కూతురు. ఆఖోంకి గుస్తాకియా అనే రొమాంటిక్ డ్రామాతో గత ఏడాది వెండితెరకు ఇంట్రడ్యూస్ అయ్యింది. విక్రాంత్ మాస్సే హీరోగా తెరకెక్కిన ఆఖోంకి గుస్తాకియా బాక్సాఫీస్ బాంబ్గా మారడంతో శనాయకు ఐడెంటిటీ రాలేదు. నెక్ట్స్ ‘తు యా మై’ అనే సర్వైవల్ థ్రిల్లర్ మూవీతో వచ్చినా సేమ్ రిజల్ట్. చేసేదేమీ లేక సోదరి జాన్వీ తరహాలో యాక్టింగ్ నేర్చుకోమని టాలీవుడ్ తోలేస్తున్నారు పేరేంట్స్. తెలుగులో ఓ క్రేజీ ఆఫర్ పట్టేసిందట భామ. తేజ సజ్జా హీరోగా కోవిడ్ టైంలో వచ్చి హిట్ కొట్టిన ఫిల్మ్ జాంబి రెడ్డి. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్గా ఫిక్సైందట శనాయ. ప్రశాంత్ వర్మ ఈ సినిమా బాధ్యతలను మరొకరికి అప్పగించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న జాంబిరెడ్డి2 నెక్ట్స్ ఇయర్ రిలీజ్ కాబోతోంది. మరి బాలీవుడ్లో తడబడిన శనాయ టాలీవుడ్లో రాణిస్తుందా అక్క జాన్వీకి పోటీ మారుతుందా చూడాలి.

