Forty Five Years Edureetha : నలభై ఐదేళ్ళ ‘ఎదురీత’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Forty Five Years Edureetha :
నటరత్న యన్.టి.రామారావు రాజకీయ ప్రవేశం చేయకముందే ‘జనం మనిషి’ అనిపించుకున్నారు. అందుకు జనాల్లో యన్టీఆర్ కు విశేషాదరణ ఉండడం ఓ కారణం కాగా, సినీజనాలకు సదా దన్నుగా నిలవడమూ మరో కారణం! టెక్నీషియన్స్ అంటే రామారావుకు ఎంతో గౌరవం. అలా ప్రముఖ ఛాయాగ్రాహకుడు వి.యస్.ఆర్.స్వామి వెళ్ళి, హిందీ ‘అమానుష్’ చిత్రాన్ని రీమేక్ చేస్తామని చెప్పగానే, ఆ కథలోని వైవిధ్యం నచ్చి, వారికి కాల్ షీట్స్ ఇచ్చారాయన. స్వామితో కలసి శాఖమూరి రామచంద్రరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘రీమేక్స్’ తెరకెక్కించడంలో కింగ్ అనిపించుకున్న వి.మధుసూదనరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వాణిశ్రీ నాయికగా రూపొందిన ఈ చిత్రం 1977 జూలై 22న విడుదలయింది.
‘అమానుష్’ చిత్రాన్ని బెంగాలీ నటుడు ఉత్తమ్ కుమార్ హీరోగా బెంగాలీ, హిందీ భాషల్లో దర్శకుడు శక్తి సామంత తెరకెక్కించారు. ఆ సినిమా రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. హీరోను ప్రేమించిన అమ్మాయే ద్వేషిస్తూ ఉండడం, చేరువనే చెలి ఉన్నా ఆమె మనసులో హీరో చివరిదాకా చోటు సంపాదించక పోవడం ఇందులోని ప్రధానాంశం. ఈ అంశమే రామారావును ఆకట్టుకుంది. వైవిధ్యమైన ఈ ప్రేమకథలో నటించడానికి యన్టీఆర్ అంగీకరించారు. అందుకు ప్రధానమైన కారణం మరొకటి ఉంది. అంతకు ముందు సంవత్సరం యన్టీఆర్, వాణిశ్రీ జంటగా నటించిన ‘ఆరాధన’ కూడా హిందీ చిత్రం ‘గీత్’కు రీమేక్. ఆ సినిమా 1976 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలచింది. దాంతో ‘అమానుష్’పైనా రామారావుకు ఆసక్తి కలిగింది.
Also Read
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- Peddi Censor Review : 'రంగస్థలం'ను మించిన యాక్టింగ్.... లాస్ట్ 50 నిమిషాలు గూస్బంప్స్ గ్యారెంటీ!
- Purusha: ఫ్లాప్ అయితే మళ్లీ వ్యవసాయమే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్
ఇక ‘ఎదురీత’లోని కథ ఏమిటంటే – గోదావరి ఒడ్డున ఉన్న బొబ్బర్లంక గ్రామంలో పోలీస్ అధికారిగా ఆనందరావు వస్తాడు. ఆయనకు ఆరంభంలోనే ఆ ఊరి ప్రెసిడెంట్ భూషయ్య, మనసున్న డాక్టర్ ధర్మయ్య, డాక్టర్ చెల్లెలు రాధ తదితరులు పరిచయం అవుతారు. ఆ తరువాత ఎంతో భిన్నమైన ప్రవర్తన ఉన్న తాగుబోతు మధు కూడా కనిపిస్తాడు. జమీందారీ వంశానికి చెందినవాడైనా పరిస్థితుల ప్రభావం వల్ల మధు తాగుబోతుగా తిరుగుతూ ఉంటాడు. ఒకప్పుడు రాధ, మధు ఎంతగానో ప్రేమించుకుని ఉంటారు. పెళ్ళి కూడా చేసుకోవాలని భావిస్తారు. అయితే కొంతమంది మోసం వల్ల తన జమీందారీకి మధు దూరం కావలసి వస్తుంది. ప్రస్తుతం ఓడ నడుపుకుంటూ, గూడెంలో అబ్బులు, సుబ్బులు అనే ఇద్దరు జతగాళ్ళతోనూ, మంగతోనూ సన్నిహితంగా ఉంటాడు. అసలు విషయం ఏమిటంటే, జమీందార్ కు భూషయ్య దివాన్ గా ఉంటాడు. మధు రాకతో తన ఆట సాగదని, దివానంలోని నగలు మాయం చేస్తాడు. అలాగే ఓ అమ్మాయి మధు మోసం కారణంగా చనిపోయిందనీ ఒప్పిస్తాడు. దాంతో మధు తాత అతడిని అసహ్యించుకుంటాడు. అలాగే ప్రేమించిన రాధ సైతం దూరమవుతుంది. ఈ విషయాలన్నీ ఆనందరావుకు తెలుస్తాయి. మధును ఆనందరావు దారిలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఇద్దరూ మంచి మిత్రులవుతారు. మధుతో తాగడం మాన్పించి, అతనికి ఓ డ్యామ్ కాంట్రాక్ట్ ఇప్పిస్తాడు ఆనందరావు. వరదలు వస్తాయి. కట్ట తెగుతుంది. ఊరు కొట్టుకు పోతుందని గగ్గోలు పెడతారు. గూడెంవారు కట్టవేయాలంటారు. పేదవారికోసం ఏమైనా చేస్తాను కానీ, పెద్దవాళ్ళ ఇళ్ళు ఏమై పోయినా పరవాలేదంటాడు మధు. అప్పుడు రాధ వచ్చి, తన కోసం ఆ సాయం చేయమంటుంది. ప్రియురాలి కోసం గూడెం జనాన్ని తీసుకువెళ్ళి కట్టతెగకుండా చూస్తాడు మధు. గూడెం జనం ఇళ్లను తగలబెట్టిస్తాడు భూషయ్య. అన్నాళ్ళు భూషయ్య తనను ఎంతగా బాధ పెట్టినా సహించిన మధు, పేదవారి నీడను మంటపాలు చేసేసరికి రెచ్చిపోతాడు. భూషయ్యను చితకబాది అన్ని విషయాలు నిజం కక్కిస్తాడు. ఆనందరావు వచ్చి, భూషయ్యను అతని అనుచరులను అరెస్ట్ చేసి తీసుకుపోతూ, మధును అభినందిస్తాడు. రాధ తాను మధును అపార్థం చేసుకున్నానని చెబుతుంది. మధు, రాధ కలుసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.
జయసుధ, జగ్గయ్య, కాంతారావు, సత్యనారాయణ, సారథి, బాలకృష్ణ (అంజి), పద్మనాభం, ముక్కామల, సాక్షి రంగారావు, రమణమూర్తి, జగ్గారావు ఇతర ముఖ్యపాత్రధారులుగా నటించారు. శక్తిపద రాజ్ గురు రాసిన కథ ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి సత్యానంద్ మాటలు రాయగా, పాటలను శ్రీశ్రీ, కొసరాజు, వేటూరి పలికించారు. సత్యం సంగీతం సమకూర్చారు. “ఎదురీతకు అంతం లేదా…”, “ఈ రాధ చివరికి ఏమైనా…”, “బాలరాజు బంగారు సామీ…”, “తొలిసారి ముద్దివ్వమంది…”, “తాగితే ఉయ్యాల…”, “గోదారి వరదల్లో…” అంటూ సాగే పాటలు అలరించాయి.
ఈ సినిమా విడుదల నాటికి యన్టీఆర్ ‘అడవిరాముడు’ విడుదలై 85 రోజులయింది. ఆ చిత్ర జైత్రయాత్ర నిర్విఘ్నంగా సాగుతున్న సమయమది. ఆ గాలివీస్తున్నప్పుడు వచ్చిన ‘ఎదురీత’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఈదలేకపోయింది. ఈ సినిమాలో యన్టీఆర్ ను భిన్నంగా చూసిన జనం, దీనికన్నా మిన్నగా తమను ఆకట్టుకున్న ‘అడవిరాముడు’ వైపే పరుగులు తీశారు. దాంతో ‘అడవిరాముడు’ విజయయాత్ర మరింతగా సాగింది. ‘ఎదురీత’ శతదినోత్సవం చూసింది. రిపీట్ రన్స్ లో అలరించింది.
తాజావార్తలు
-
Trump vs Netanyahu: ట్రంప్ నిర్ణయంపై నెతన్యాహు తీవ్ర ఆగ్రహం.. అమెరికా ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ పై ఇజ్రాయెల్ అనుమానాలు!
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!