NTV Telugu Site icon

FNCC: ఏపీ సీఎంతో భేటీ.. 25 లక్షలు విరాళం అందించిన ఎఫ్ఎన్సీసీ

Mohan Mullapudi

Mohan Mullapudi

FNCC Team met the AP CM to Handover donation of 25 lakhs: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఇటీవల భారీ వర్షాల వల్ల వరదలు రాగా ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీ నష్టం వాటిల్లింది. అయితే వరద బాధితుల సహాయార్ధం ఇప్పటికే ఎందరో సినీ మరియు ఇతర రంగాల ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎఫ్ ఎన్ సి సి తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు గారిని కలిసి 25 లక్షల విరాళాన్ని అందజేశారు ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు, సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి, జాయింట్ సెక్రటరీ పెద్దిరాజులు. ఈ క్రమంలో ప్రెసిడెంట్ జి ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినా ప్రతిసారి ఎఫ్ ఎన్ సి సి క్లబ్ సహాయ కార్యక్రమాలలో ముందు ఉంటుంది అని తెలియ చేసారు.

Harsha Sai: హర్షసాయిపై మరోకేసు

సెక్రెటరీ మోహన్ ముళ్ళపూడి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో గాని తెలంగాణలో గాని ఎలాంటి విపత్తు వచ్చినా ఎఫ్ ఎన్ సి సి తరఫున సహాయం గతంలో చేసాం ఇప్పుడు,ఎప్పుడు చేయడానికి ముందుంటాం అని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని కలిసి 25 లక్షలు, తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డిని కలిసి 25 లక్షలు విరాళం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఫిలిం నగర్ క్లబ్ కి చాలా అండగా నిలబడుతున్నాయి, అందుకుగాను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, ఎఫ్ ఎన్ సి సి ఎప్పుడు ఇలాంటి సహాయ కార్యక్రమాల్లో ముందుంటుంది అని తెలియ చేశారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ సభ్యులను రెండు రాష్ట్రాల సీఎంలు అభినందించారు.