గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ మరియు క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా సినిమా డ్రాగన్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే బర్త్డే ట్రీట్ ఇచ్చేందుకు చిత్ర యూనిట్ సర్వం సిద్ధం చేసింది. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన ఫస్ట్ అఫీషియల్ గ్లింప్స్ రిలీజ్ కు మేకర్స్ టైమ్ లాక్ చేసారు.
ఈ మంగళవారం రాత్రి సరిగ్గా 11:52 గంటలకు ఈ చిత్ర గ్లింప్స్ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేయనున్నారు. అంటే.. తారక్ పుట్టినరోజుకు కేవలం ఎనిమిది నిమిషాల ముందే ఈ మాస్ అప్డేట్ రాబోతోంది. వాస్తవానికి అర్ధరాత్రి 11.59 గంటలకు రిలిజ్ చేయాలనీ భావించారు. కానీ సెంటిమెంట్ లేదా ప్రత్యేకమైన నంబర్ కాలిక్యులేషన్స్ ప్రకారం చిత్ర బృందం ఈ 11:52 PM సమయాన్ని లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రకటనతో నార్త్ నుండి సౌత్ వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. కెజిఎఫ్, సలార్ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఊచకోత కోసిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ను ఏ రేంజ్ మాస్ ఎలివేషన్లతో చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ గ్లింప్స్ ద్వారా డ్రాగన్ టైటిల్ను అఫీషియల్ గా ప్రకటించబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గ్లింప్స్ కోసం కంటిమీద కునుకు లేకుండా వెయిట్ చేస్తున్నామని ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు
