టాలీవుడ్ స్థాయిని హాలీవుడ్ రేంజ్ తీసుకెళ్లిన జక్కన్న.. స్టార్ హీరోల కన్నా ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నాడు. హీరో మేటర్ కాదు కానీ ఏ హీరోతో సినిమాలు చేసినా సక్సీడ్ అవుతున్న నేపథ్యంలో రాజమౌళి డిమాండ్ పెరిగింది. ఇక ఎకనామికల్ థీరి డిమాండ్ అండ్ సప్లయ్ ప్రకారం పేమెంట్లో మార్పులు మొదలయ్యాయి. దేశంలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్స్ తీసుకున్న దర్శకుడిగా అవతరించాడు జక్కన్న. వారణాసి కోసం రూ. 200 కోట్లను చార్జ్ చేస్తున్నాడన్న టాక్ వినిపించింది కానీ.. ప్రాఫిట్లో షేర్ కోరుతున్నాడని టాక్.
పుష్పతో పాన్ ఇండియా ఐడెంటిటినీ క్రియేట్ చేసుకున్న అల్లు అర్జున్ కూడా నెక్ట్స్ సినిమాను ఆ స్థాయి తగ్గకుండా ప్లాన్ చేస్తున్నాడు. బాలీవుడ్ బాక్సాఫీసును షేక్ చేసిన బన్నీ నెక్ట్స్ అట్లీకి ఛాన్స్ ఇచ్చాడు. ఎందుకంటే షారూఖ్ ఖాతాలో జవాన్ రూపంలో బిగ్గెస్ట్ హిట్ వేశాడు. అట్లీ తీసిన సినిమాలన్నీ కమర్షియల్ హిట్స్ కావడంతో ఈ కోలీవుడ్ డైరెక్టర్ ఇమేజ్ డబులై అతడి రెమ్యునరేషన్ వెయిటేజ్ పెరిగింది. అందుకే బన్నీతో సినిమాకు ఏకంగా రూ. 100 కోట్లు చార్జ్ చేస్తున్నాడు అట్లీ. జస్ట్ ఎలివేషన్లతోనే హీరోలకు క్రేజ్ తెచ్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా పేమెంట్ పెంచేశాడు. తారక్ డ్రాగన్ మూవీ కోసం రెమ్యునరేషన్తో పాటు ప్రాపిట్ షేర్ అడుగుతున్నాడట. 50 శాతం షేర్ అడిగాడని అందుకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాయట నిర్మాణ సంస్థలు. అంటే నీల్ మామ క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అదీ.
ఫ్యామిలీ ఎంటర్టైనర్లతోనే బాక్సాఫీస్ బెండ్ తీసే అనిల్ రావిపూడికి కూడా ఇలాంటి ఇమేజ్ ఏర్పడింది. ఇప్పటి వరకు ఫ్లాప్ ఎరుగని ఈ రీజనల్ హిట్ డైరెక్టర్ నెక్ట్స్ మల్టీస్టారర్ మూవీకి కూడా రెమ్యునరేషన్ పెంచాడని టాక్. రూ. 35 కోట్ల వరకు పుచ్చుకుంటున్నాడని సమాచారం. అలాగే కోలీవుడ్ మేకర్ లోకేశ్ కనగరాజ్.. బన్నీతో తీయబోయే సినిమాకు రూ. 75 కోట్ల వరకు చార్జ్ చేస్తాడని తెలుస్తోంది.

