వీరసింహారెడ్డితో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన మాస్ డైరెక్టర్ గోపించద్ మలినేని… నెక్స్ట్ ప్రాజెక్ట్ మాస్ మహారాజా రవితేజతో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. డాన్ శీను, బలుపు, క్రాక్ తర్వాత… నాలుగోసారి ఈ క్రేజి కాంబినేషన్ వర్కౌట్ అవడంతో అనౌన్స్మెంట్ నుంచే అంచనాలు పెరిగిపోయాయి కానీ గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అవ్వడం వల్ల… మైత్రీ మూవీ మేకర్స్ #RT4GM ప్రాజెక్ట్ను హోల్డ్లో పెట్టినట్టుగా టాక్ నడుస్తోంది. అసలు మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసి… ఈ సినిమాను హోల్డ్ చేయడం ఏంటి? రవితేజ సినిమాకి బడ్జట్ ఇష్యూస్ ఏంటి అనేది రవితేజ అభిమానులకి అంతుబట్టని విషయంగా మారింది.
#RT4GM ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టడం గురించి మైత్రీ మూవీ మేకర్స్ నుంచైతే ఇంకా ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ ఫిల్మ్ నగర్ వర్గాల్లో మాత్రం ఈ సినిమాను మరో హీరోతో ప్లాన్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా తమిళ్ లేదా హందీ హీరో కోసం ట్రై చేస్తున్నారట. అన్నీ కుదిరితే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్తో మైత్రీ మూవీస్ ప్లాన్ చేస్తున్నట్టుగా పుకార్లు వస్తున్నాయి. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే గోపీచంద్ మలినేని-రవితేజ ప్రాజెక్ట్ కాకుండా మరో ప్రొజెక్ట్ ని మైత్రీ మూవీ మేకర్స్ స్టార్ట్ చేయనుంది. #RT4GM ని హోల్డ్ లో పెట్టి ఈలోపు గోపీచంద్ మలినేనితో ఒక మల్టీలాంగ్వేజ్ సినిమా చేసే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ ఉన్నట్లున్నారు. మరి #RT4GM స్టార్ట్ అవుతుందా లేక గోపీచంద్ మలినేని మరో హీరోతో ఇంకో సినిమా స్టార్ట్ చేస్తాడా అనేది చూడాలి.