మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై సుమన్, సాయికుమార్, నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుo భాస్కర్ నిర్మిస్తోన్న ఈ పొలిటికల్ ఎంటర్టైనర్ చిత్రం.. ప్రస్తుతం షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర మ్యూజికల్ ప్రమోషన్స్ను ఇటీవలే మేకర్స్ ప్రారంభించారు. ‘న్యాయం చేయరా దేవుడా..’ డ్యాన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ డ్యాన్స్ నెంబర్తో ప్రేక్షకులను అలరించబోతున్నట్లుగా సాంగ్ గ్లింప్స్ వదిలిన మేకర్స్.. తాజాగా ఇదే పాటకు సంబంధించిన ఫుల్ లిరికల్ సాంగ్ను ఆస్కార్ విజేత చంద్రబోస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి దర్శకనిర్మాతలతో పాటు చిత్రానికి సంబంధించిన పలువురు హాజరయ్యారు.
ఈ పాట ఆవిష్కరణ అనంతరం లిరిసిస్ట్ చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘ధర్మస్థల నియోజకవర్గం’ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమాలో ‘న్యాయం చేయరా దేవుడా..’ అనే లిరికల్ సాంగ్ని విడుదల చేసినందుకు సంతోషంగా ఉంది. ఈ పాటకు నేనే సాహిత్యం అందించాను. సునీత గారు ఆలపించారు.ఈ సినిమా డైరెక్టర్ జై జ్ఞాన ప్రభ తోట గారు మంచి విజన్ ఉన్న డైరెక్టర్ . ఆయనకు సాహిత్యం పై మంచి పట్టు ఉంది.ఆయనకు తగ్గట్టు మంచి టెస్ట్ ఫుల్ నిర్మాత భాస్కర్ గారు కలిసి నా నుంచి చక్కటి సాహిత్యాన్ని రాబట్టారు. మహావీర్ ఎల్లంధర్ స్వరాలు సమకూర్చారు. సినిమా చాలా బాగుంటుంది. ఇందులో మంచి మెసేజ్ ఉంది. తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవ్వాలని, యూనిట్కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని అన్నారు.
