Dasari Narayana Rao: ఎన్టీఆర్ విషయంలో దాసరికి ఆ కోరిక తీరలేదు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dasari Narayana Rao: నటరత్న యన్టీఆర్, దర్శకరత్న దాసరి నారాయణరావు కాంబినేషన్ లో రూపొందిన చిత్రాలు ఐదంటే ఐదే! యన్టీఆర్ తో దాసరి తొలి చిత్రం ‘మనుషులంతా ఒక్కటే’. 1976లో విడుదలైన ఈ చిత్రం ఆ రోజుల్లో సెన్సేషనల్ హిట్. స్వాతంత్య్రానికి ముందు ఫ్యూడల్ వ్యవస్థ తీరు తెన్నుల నేపథ్యంలో కథను ఆరంభించి, నాడు అహంకరించిన రాచరికం కోరలు పెరికి, ‘దున్నేవాడిదే భూమి’ అన్న సత్యాన్ని చాటుతూ సినిమాను ముగించారు దాసరి. ఆ తరువాత ఎందుకనో దాసరి చిన్న సినిమాలతోనే బిజీగా ఉంటూ, యన్టీఆర్ లాంటి అగ్ర నటునితో సినిమా తీయడానికి దాదాపు నాలుగేళ్ళ సమయం తీసుకున్నారు. ఆ తరువాత రామారావుతో 1980లో ‘సర్కస్ రాముడు’, ‘సర్దార్ పాపారాయుడు’, 1981లో ‘విశ్వరూపం’, 1982లో ‘బొబ్బిలిపులి’ తెరకెక్కించారు దాసరి. వీటిలో ఒక్క ‘విశ్వరూపం’ మినహాయిస్తే అన్నీ జనాదరణ పొందినవే. వాటిలో ‘మనుషులంతా ఒక్కటే, సర్దార్ పాపారాయుడు, బొబ్బిలిపులి’ సిల్వర్ జూబ్లీస్ చూశాయి. ‘బొబ్బిలిపులి’ స్వర్ణోత్సవం చూసింది. తాను అక్కినేని అభిమానిని అని గర్వంగా చెప్పుకున్న దాసరి, యన్టీఆర్ తోనే జనం మెచ్చే చిత్రాలను ఘనంగా అందించారు. యన్టీఆర్ తోనే దాసరి సక్సెస్ రేట్ అధికంగా ఉంది.
యన్టీఆర్ అంటే పౌరాణికాలకు పెట్టింది పేరు. ఆయనతో ఓ మహత్తర పౌరాణికం రూపొందించాలన్నది దాసరి అభిలాష! మరి ఆయన మదిలో ఏ పౌరాణిక పాత్రలో యన్టీఆర్ ను నటింప చేయాలని భావించారు? వినడానికి చిత్రంగా ఉంటుంది. జరాసంధుని పాత్రలో యన్టీఆర్ ను చూడాలన్నది దాసరి ఆలోచన! ఎందుకంటే మహాభారతంలో భీముడు, దుర్యోధనుడు, కీచకుడు, జరాసంధుడు, బకాసురుడు ఒకే ముహూర్తంలో జన్మించిన సింహబలులు అని పేరు. ఈ ఐదు పాత్రల్లో అప్పటికే భీమ,సుయోధన,కీచక పాత్రలను రామారావు ధరించి అలరించారు. అందువల్ల జరాసంధ పాత్రలో రామారావును నటింప చేయాలన్నది దాసరి అభిలాష! జరాసంధుడు, కృష్ణుని మధ్య వైరం అన్నది అందరికీ తెలిసిందే. కృష్ణునికి మేనమామ కంసుడు. అతనికి అమ్మాయిలను ఇచ్చి పెళ్ళిచేసిన మామ జరాసంధుడు. కృష్ణుడు కంసుని చంపిన తరువాత అతనిపై జరాసంధుడు పగబట్టడం, అతని వృత్తాంతం అన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. అందువల్ల ఆ పాత్రలో రామారావును నటింపచేయాలని ఆశించారు దాసరి. కానీ, అప్పటికే రామారావు పౌరాణికాలకు అది సరైన సీజన్ కాదని కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ లోగా దాసరి ‘సర్దార్ పాపారాయుడు’ కథ రెడీ చేయడం, ఆ సినిమా షూటింగ్ లో అల్లూరి సీతారామరాజు గెటప్ లో ఉన్నప్పుడే యన్టీఆర్ లో రాజకీయాల్లో ప్రవేశించాలన్న భావన కలగడం వంటివి జరిగాయి. ఆ తరువాత యన్టీఆర్ తో ‘విశ్వరూపం, బొబ్బిలిపులి’ మాత్రమే తెరకెక్కించగలిగారు దాసరి. ఆ పై రామారావు రాజకీయాల్లో అడుగుపెట్టి ముఖ్యమంత్రిగా, తరువాత ప్రతిపక్ష నాయకునిగా, మళ్ళీ ముఖ్యమంత్రిగా సాగడంతో వీలు కాలేదు. అందువల్ల దాసరి అభిలాష అలాగే ఉండిపోయింది. యన్టీఆర్ తో పౌరాణికం ఇలా ఉంటే, శోభన్ బాబుతో ‘కృష్ణ-కుచేల’ అన్న పౌరాణికం రూపొందించాలనీ దాసరి ఆశించారు. అదీ ఫలించలేదు. ఆ తరువాత పౌరాణిక పాత్రలకు జీవం పోసే నటీనటులు లేకపోవడం వల్లే తాను పౌరాణికం రూపొందించలేదని చెప్పేవారు దాసరి. కేవీ రెడ్డి ‘మాయాబజార్’ స్ఫూర్తితో సోషియో ఫాంటసీగా అదే టైటిల్ తో దాసరి ఓ సినిమా రూపొందించారు. ఆ తరువాత ఏ ప్రయత్నమూ చేయలేదు.
Also Read
తాజావార్తలు
-
NBK 112 : బాలయ్య – కొరటాల సినిమాలో తమిళ స్టార్ హీరో?
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!