కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. ఎంతోమంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ పరిమితులను పూర్తిగా ఎత్తేశాయి ప్రభుత్వాలు. ఇక లాక్డౌన్ కారణంగా విడుదలలు వాయిదా వేసుకున్న ఎన్నో చిత్రాల నిర్మాతలు థియేటర్ల రీఓపెన్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇరు రాష్ట్రాల్లోనూ థియేటర్లు 100% ఆక్యుపెన్సీతో తిరిగి ఓపెన్ అయితే విడుదలవ్వడానికి పలు భారీ సినిమాలు కాచుకుని కూర్చున్నాయి.
Read Also : “బిగ్ బాస్” లీకులకు ఇలా బ్రేక్ వేయబోతున్నాడా?
తాజా సమాచారం ప్రకారం జూలై 8 నుంచి థియేటర్లను ఓపెన్ చేయడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతిచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లోని సినిమా థియేటర్లు 50% ఆక్యుపెన్సీతో తెరుచుకోనుండగా, తెలంగాణలో మాత్రం థియేటర్లను 100% ఆక్యుపెన్సీతో తిరిగి ప్రారంభించడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇప్పటికే పలువురు స్టార్స్ సినిమా షూటింగులకు స్టార్ట్ చేశారు. అయితే ఈ మహమ్మారి కారణంగా ఎంతమంది థియేటర్లకు వెళ్లి సినిమా చూస్తారనేది చూడాలి.
