YRF స్పై యూనివర్స్ సినిమాలను యష్ రాజ్ ఫిల్మ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ప్రమోట్ చేస్తుంటాయన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు YRF ప్రత్యేకమైన వ్యూహాలు అమలు చేస్తుంటుంది. ‘వార్ 2’లో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ తొలిసారిగా తెరపైకి కలిసి రాబోతున్నారు. ఈ క్రమంలో YRF ప్రమోషన్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటుంది. ఇద్దరితో సపరేట్గా ప్రమోషన్స్ చేయించాలని టీం భావిస్తోంది. ‘హృతిక్, ఎన్టీఆర్ కలిసి ‘వార్ 2’ని ప్రమోట్ చేయరు.
Also Read : Singayya Death Case: సింగయ్యను ఎవరో చంపేశారు.. భార్య సంచలన ఆరోపణలు
ఏ ఈవెంట్లో ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. అసలు ‘వార్ 2’ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ ఆ ఇద్దరు. అలాంటిది ఆ ఇద్దరినీ ఒకేసారి చూడాలంటే అది తెరపైనే చూడాలి. అంతే గానీ ప్రమోషన్స్లో ఏ ఒక్క చోట కూడా ఈ ఇద్దరూ కలిసి కనిపించరు. నేరుగా తెరపైనే ఆ ఇద్దరినీ ఒకే సారి చూస్తేనే ఆ థ్రిల్ ఉంటుంది’ అని యష్ రాజ్ ఫిల్మ్స్ టీం అనుకుంటోందని ఓ సీనియర్ ట్రేడ్ అనలిస్ట్ చెప్పుకొచ్చారు. 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రంగా ‘వార్ 2’ నిలుస్తుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ‘వార్ 2’ ఆగస్టు 14, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ‘వార్ 2’ను ఆదిత్య చోప్రా నిర్మించారు.ఈ చిత్రంతో కియారా అద్వానీ YRF స్పై యూనివర్స్లో చేరారు.
