‘టికెట్ కొట్టు – ఐఫోన్ పట్టు,’ మనీ రైన్ కాన్సెప్ట్స్తో ప్రేక్షకుల్లోకి చొచ్చుకుని పోయింది అని వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దారపునేని అన్నారు. . అభిమానులు, ప్రేక్షకుల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. దీంతో సినిమాకు మరింత హైప్ పెరిగింది. ఎక్కడ చూసిన వర్జిన్ బాయ్స్ గురించి చర్చ నడుస్తోందన్న ఆయన ఇది మా టీమ్ అందరిలో నూతన ఉత్సాహాన్ని పెంచిందన్నారు. దయానంద్ రచనా దర్శకత్వంలో రాజ్ గురు బ్యానర్ పై రాజా దారపునేని నిర్మించిన చిత్రం వర్జిన్ బాయ్స్. బిగ్బాస్ ఫేం మిత్ర శర్మ, గీతానంద్ జంటగా నటిస్తుండగా శ్రీహాన్, కౌశల్, రోనీత్, జెనీఫర్, అన్షుల, సుజిత్ కుమార్, బబ్లూ, అభిలాష్ కీలక పాత్రలు పోషించారు. ఈ నెల 11న గ్రాండ్గా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ సినిమా కోసం ఆర్టిస్ట్లు ప్రతి ఒక్కరూ ఎంతగానో కృషి చేశారు. ప్రమోషన్స్ కూడా వినూత్నంగా చేస్తున్నారు. మిత్ర శర్మ ప్రమోషన్ కోసం కూడా బాగా కష్టపడుతున్నారు. గతంలో ఆమె ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కూడా పలువురికి ఆమె సాయం అందించారు. ప్రతి క్షణం అందుబాటులో ఉండి బెటర్ అవుట్పుట్ కోసం కృషి చేసిన టీమ్ అందరికీ కృతజ్ఞతలు. నిర్మాణ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. యూత్తో పాటు కుటుంబ ప్రేక్షకుల్ని కూడా సినిమా చక్కగా ఆకట్టుకుంటుందన్నారు.
Also Read:Chiranjeevi : విశ్వంభర సెట్స్ నుంచి మెగాస్టార్ లుక్..!
తొలి ఫోన్ గెలుచుకున్న ప్రవీణ్
గురువారం మాదాపూర్ ప్రాంతంలో ఓ షాప్ ఓపెనింగ్ లో పాల్గొన్న మిత్ర శర్మ, వర్జిన్ బాయ్స్ టీం అడ్వాన్స్ టికెట్ తీసుకున్న వారిని వివరాలతో లాటరీ తీయగా చందా నగర్ కు చెందిన ప్రవీణ్ ఐఫోన్ గెలుచుకున్నారు. ఇది మొదటి ఫోన్ మాత్రమే. ఇంకా దాదాపు పది లాటరీస్ ఉన్నాయని టీం తెలిపారు.
