Director Vamsi: వంశీ ‘పసలపూడి కథలు’పై పరిశోధనకు డాక్టరేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ దర్శకులు వంశీకి తెలుగు సినీ చరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. కె. విశ్వనాథ్, బాపు, దాసరి, రాఘవేంద్రరావు తరహాలోనే వంశీ ది కూడా ఓ భిన్నమైన శైలి. వంశీ మార్కు చిత్రాల కోసం నేటికీ ఎదురు చూసే లక్షలాది సినిమా అభిమానులు ఉన్నారు. విశేషం ఏమంటే… దర్శకుడిగా మెగా ఫోన్ చేతిలోకి తీసుకోకముందు నుండే వంశీ ఓ గొప్ప రచయిత. ఆయన రాసిన కథలు, నవలలు పలు వార, మాస పత్రికలో ప్రచురితమయ్యాయ. బహుమతులూ పొందాయి. తాను రాసిన ‘మహల్లో కోకిల’ నవలే ‘సితార’ పేరుతో సినిమాగా తీశారు వంశీ. ఆయన సొంతూరు తూర్పు గోదావరి జిల్లా లోని పసలపూడి. ఆ ఊరంటే వంశీకి అమితమైన ఇష్టం. అలానే గోదావరిని వంశీని కూడా విడిదీసి చూడలేం. ఆయన కథల్లోనూ, చిత్రాల్లోనూ గోదావరికి ఎంతో ప్రాధాన్యముంటుంది. అలాంటి వంశీ సొంతూరు పసలపూడి నేపథ్యంలో ‘పసలపూడి కథలు’ రాశారు. ఇవి విశేషమైన పాఠకాదరణ పొందాయి.
Also Read
- NTR - Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
- Idupu Kayitham : రచ్చ రచ్చ చేస్తున్న 'ఇడుపు కాయితం'.. నేషనల్ ఇష్యూ చేశారంటూ నరేశ్ ఫైర్!
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
వంశీ పసలపూడి సమీప గ్రామం ‘గొల్లల మామిడాడ’కు చెందిన కె. రామచంద్రరెడ్డి 24 సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలలో తెలుగు లెక్చరర్ గా పని చేస్తున్నారు. ఆయనకు పసలపూడి కథలంటే ఎంతో ఇష్టం. అందుకు తన పి.హెచ్.డి. పరిశోధనాంశంగా దానినే ఎంచుకున్నారు. గోదావరి తీరానికే చెందిన ఆయనకు అక్కడియాస, భాష, మాండలికంపై అవగాహన ఉంది. దాంతో పెద్ద ఇబ్బంది లేకుండా తనపరిశోధనను విజయవంతంగా పూర్తి చేసి ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పొందారు. తన పరిశోధనను మొత్తం ఏడు అధ్యాయాలుగా విభజించారు రామచంద్రారెడ్డి. వాటిలో రచయితతో ముఖాముఖితో పాటు బాపు – రమణల ప్రశంసా కవిత, వంశీ కథలకు బాపు గీసిన బొమ్మలు, కథల్లోని ప్రాంతాల ఫోటోలతో పాటు పలు ఆసక్తికరమైన అంశాలను పొందుపరిచారు.

ప్రస్తుతం ఇజ్రాయిల్లోని హిబ్రూ యూనివర్సిటీ ఈఆర్సీ – నీమ్ ప్రాజెక్టులో కె. రామచంద్రారెడ్డి సభ్యుడిగా ఉన్నారు. ‘అమెరికా అట్లాంటా’లోని ఎమొరీ యూనివర్సిటీలో జరిగిన కాన్ఫరెన్స్లో పాల్గొని పరిశోధన పత్రాన్ని సమర్పించారు. ఇంకా పలు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సెమినార్లలో పాల్గొని రీసెర్చ్ పేపర్లు సబ్మిట్ చేశారు. ‘తూర్పుగోదావరిజిల్లా… సమగ్ర సాహిత్యం’ అనే బృహత్ సంపుటానికి, ‘తూర్పు గోదావరి జిల్లా కథలు… అలలు’ అనే కథా సంపుటికి సహ సంపాదకుడిగా ఆయన పని చేశారు. ‘రంగుల నింగి’ అని 1998లో హైకూ సంపుటాన్ని వెలువరించారు. తెలుగు హైకూల్లో సామాజిక అనే అంశంపైఎంఫిల్ చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: ఓటమికి కారణాలు ఇవే.. తప్పులను నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్..
-
Harmanpreet Kaur: ఆ తప్పే మా కొంపముంచింది.. ప్రతీ సారి ఇలానే జరుగుతోంది.. భావోద్వేగానికి లోనైన కెప్టెన్..
-
CM Chandrababu : ఐదు రోజుల సీఎం టూర్.. వరుసగా భారీ కార్యక్రమాలు
-
IND Vs IRE: ప్రపంచ ఛాంపియన్ను మట్టికరిపించిన ఐర్లాండ్.. సిరీస్ కైవసం..
-
Nimmala Ramanaidu : జగన్వి అన్నీ క్రెడిట్ చోరీ ముచ్చట్లే.. వెలిగొండను పూర్తి చేసేది చంద్రబాబే
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!