NTV Telugu Site icon

Pushpa : విభేదాలకు చెక్ పెట్టేందుకు ఒకే వేదికపైకి బన్నీ- సుక్కు..

Untitled Design (6)

Untitled Design (6)

ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ల లేటెస్ట్ సినిమా పుష్ప -2. ప్రస్తుతం సెట్స్ ఫై ఉన్న ఈ సినిమా ఏప్పటికప్పుడు విడుదల వాయిదా పడుతూ, షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తోంది. ఒకానొక దశలో చిత్ర దర్శకుడు సుకుమార్ కు హీరో అల్లు అర్జున్ కు మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వినిపించాయి. బన్నీ గడ్డం కూడా తీసేయడంతో ఆ వార్తలకు మరింత ఊతం వచ్చాయి. ఇటీవల ఈ చిత్రం చివరి షెడ్యూల్ స్టార్ట్ చేసారు మేకర్స్.

Also Read : Mahesh Babu: AMB సినిమాస్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమా ఎదో తెలుసా..?

మరోవైపు దర్శకుడు సుకుమార్ భార్య తబిత సుకుమార్ సమర్పణలో ‘మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం’ అనే సినిమా వస్తోంది. రావు రమేష్ హీరోగా నటించిన ఈ మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ హాజరు కానున్నారు. డైరెక్టర్ లక్ష్మణ్ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా సుకుమార్ భార్య తబితకు ఈ సినిమా చూపించాడు. కంటెంట్ నచ్చి ఈ సినిమాకు సమర్పికురాలుగా వ్యవహరిస్తోంది. పుష్ప సినిమా షూటింగ్ హడావుడిలో సుకుమార్ బిజీగా ఉండడంతో ఈ సినిమా పనులను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు తబితసుకుమార్. విభేదాల ప్రచారం తరువాత మొదటిసారి కలిసి మీడియా ముందుకు వస్తోన్నారు అల్లు అర్జున్, సుకుమార్. ఈ నేపథ్యంలో వీరిద్దరు విభేదాల రూమర్స్ పై ఏ విధంగా స్పందిస్తారు, ఏమి మాట్లాడతారు అనే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. ఈ రోజు సాయంత్రం 7గంటలకు హోటల్ పార్క్ హయత్ లో ఈ వేడుక జరగనుంది.