తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో రవి మోహన్ (జయం రవి), భార్య ఆర్తి విడిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరి వీడాకులకు సంబందించిన న్యాయపరమైన వివాదం ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంది. గత కొంతకాలంగా విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలిచిన ఈ జంట మధ్య కోర్టు వివాదాలు మరింత ముదిరాయి. తాజాగా ఆర్తి తన పిల్లల ఖర్చులు, భరణం విషయమై మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించడం కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.
తన పిల్లల పాఠశాల ఫీజులతో సహా రోజువారీ భరణం ఖర్చులను రవి మోహన్ ఏప్రిల్ 2025 నుండి అందించడం లేదని ఆర్తి ఆరోపించారు. పిల్లల చదువు, ఇతర అవసరాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని అందుకే తాను న్యాయ సహాయం కోరాల్సి వచ్చిందని ఇటీవల కోర్టుకు తెలియజేశారు. చెన్నై ఫ్యామిలీ కోర్టులో ఇప్పటికే పెండింగ్లో ఉన్న తన మధ్యంతర భరణం పిటిషన్పై త్వరితగతిన విచారణ జరపాలని కోరుతూ ఆమె మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఆర్తి దాఖలు చేసిన ఈ అత్యవసర పిటిషన్ను పరిశీలించిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఫ్యామిలీ కోర్టులో ఉన్న భరణం పిటిషన్ను తక్షణమే విచారణకు స్వీకరించి రెండు వారాల్లోగా దీనిపై తగిన ఉత్తర్వులు జారీ చేయాలని చెన్నై ఫ్యామిలీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో జయం రవి, ఆర్తిల వివాదంలో ఫ్యామిలీ కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్తితో విడిపోయిన జయం రవి కొంతకాలంగా సింగర్ కేనికతో స్నేహంగా మెలిగారు. కానీ ఇక నావల్ల కాదని జయం రవికి దూరంగా వెళ్తున్నానని ప్రకటన చేయడంతో ఆర్తి తనకు కావాల్సిన వారిని కూడా వేధిస్తోందని జయం రవి సంచలన ఆరోపణలు చేసారు.

