NTV Telugu Site icon

Kalki 2898 AD : కల్కి టీం కు గుడ్ న్యూస్ చెప్పిన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు..?

Kalki (1)

Kalki (1)

Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాను బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో అమితాబ్ ,కమల్ వంటి లెజెండరీ యాక్టర్స్ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాలో దీపికా పదుకోన్ ,దిశా పాటని హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేసారు.ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమా ను విజువల్ వండర్ గా తెరకెక్కించారు.

Read Also :Chiranjeevi : చంద్రబాబు ప్రమాణ స్వీకారనికి మెగాస్టార్ కు ప్రత్యేక ఆహ్వానం..

ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రతి ప్రేక్షకుడు సరికొత్త ప్రపంచాన్ని చూస్తున్న అనుభూతి చెందుతాడు.ట్రైలర్ లో ప్రభాస్ స్టంట్స్ ,అమితాబ్ ,కమల్ లుక్స్ ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించాయి. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా టీం కు తెలుగు రాష్ట్రాల ప్రుభుత్వాలు గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది.కల్కి సినిమాకు టికెట్స్ ధరలు పెంచుకుందుకు తెలుగు రాష్ట్రాల ప్రుభుత్వాలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.కల్కి సినిమాకు టికెట్ ధరలు పెరిగితే తెలంగాణాలో మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్ ధర రూ.413 ,సింగల్ స్క్రీన్ రూ.236 గా ఉండనుంది.అలాగే ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధర 200 నుండి 350 వరకు ఉండనున్నట్లు సమాచారం.టికెట్స్ రేట్స్ పెరగడం మూలాన సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం వుంది.