‘స్వాతి’ మణిచందన కన్నుమూత

Swati Manichandana Passed Away Due to Covid-19

స్వాతి వీక్లీ అసోసియేట్ ఎడిటర్ మణిచందన క్యాన్సర్ పోరులో ఓడిపోయారు! ఈరోజు కన్నుమూశారు! స్వాతి పబ్లిషర్ , ఎడిటర్ శ్రీ వేమూరి బలరాం గారి కుమార్తె ఈమె! స్వాతి నిర్వహణ లో ఈమె కీలకపాత్ర పోషిస్తున్నారు. మణిచందన భర్త అనిల్ కుమార్ ఆంధ్రప్రదేశ్ ఇన్ కం టాక్స్ ప్రిన్సిపల్ కమీషనర్ గా పని చేస్తున్నారు. మణిచందన వయసు 46. ఇద్దరు పిల్లలు. గత ఏడాదిగా ఆమె కాన్సర్ తో పోరాడుతున్నారు. వారం రోజుల క్రితం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తుదిశ్వాస విడిచారు. విచారకరం! ఆమె కు నివాళి!