SP Charan: ఎస్పీ బాలు వాయిస్ వాడేశారు.. కీడా కోలా టీంకి ఎస్పీ చరణ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడో చనిపోయిన ఒక గాయకుడి గొంతును ఏఐ సహాయంతో మళ్లీ రీ క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రెహమాన్ కంటే ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ సహాయంతో రీ క్రియేట్ చేశారు. అయితే ఈ విషయం మీద ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కీడాకోలా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య రావు, జీవన్, విష్ణు వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అయితే ఒక చిన్న కామెడీ సీక్వెన్స్ లో భాగంగా మా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ ద్వారా రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. స్వాతిలో ముత్యమంత అనే సాంగ్ సినిమాలో ఒక కామెడీ సీక్వెన్స్ కోసం వాడారు. దాని కోసమే ఏఐ ద్వారా సాంగ్ రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read; Pakistan Army: ఇమ్రాన్ ఖాన్కు ప్రధాని పదవిని ఆఫర్ చేసిన పాక్ ఆర్మీ.. కానీ, కండిషన్స్ అప్లై
Also Read
- RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
- Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
- Toxic : 'టాక్సిక్’ లేడీస్ & లేడీస్ గ్లిమ్స్ రిలీజ్.. ఈసారి మరింత వైల్డ్గా యశ్
- KTR-Prabhas: రచ్చ రచ్చే.. లైవ్లో రెబల్ స్టార్ ప్రభాస్కు ఫోన్ చేసిన కేటీఆర్ (వీడియో)
ఈ విషయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన జనవరి 18వ తేదీన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సహా సినీ దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు పంపారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీద ఎస్పీ చరణ్ స్పందిస్తూ నాకు దూరమైన మా తండ్రి వాయిస్ ని ఏ ద్వారా రీ క్రియేట్ చేయడం బాగుంది , చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించిందనీ అన్నారు. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు’ అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే ఈ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్లాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
APEAPCET: ఏపీఈఏపీసెట్ ఫలితాలు విడుదల
-
RC18: గురువు తర్వాత శిష్యుడే.. రామ్ చరణ్ మాటతో భారీ అడ్వాన్స్ ఇచ్చిన టాప్ ప్రొడ్యూసర్!
-
Kejriwal: సనాతనం అంటే అధికారం.. డబ్బేనా? అయోధ్య స్కామ్లో బీజేపీపై కేజ్రీవాల్ విమర్శలు
-
Nagabandham : ‘నాగబంధం’ ధైర్యం వెనుక అసలు నిజమిదే!
-
MEIL Enters Industrial AI: ఇన్ఫ్రా రంగం నుంచి ఐటీ విప్లవం వైపు.. ఏఐలోకి మేఘా సంస్థ ఎంట్రీ
ట్రెండింగ్
-
How to Kill Men: మెట్రోలో యువతి చేతిలో ‘మగాళ్లను చంపడం ఎలా’ పుస్తకం.. షాక్ అవుతున్న నెటిజన్లు!
-
Harry Brook: మా ప్లాన్స్ మాకున్నాయి.. దాచాం చాలా.. వైభవ్ను ఈజీగా బుట్టలో వేస్తాం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ రాకపోవడమే మంచిది.. అసలు కారణం..!
-
IND vs ENG 1st T20: ఇంగ్లండ్ తుది జట్టు ప్రకటన.. ఆ ఇద్దరు స్టార్లకు నో ప్లేస్.. టీమిండియా హ్యాపీ!
-
Farmer Job Offer: జాబ్ ఆఫర్ చేసిన మహిళా రైతు.. ఉదయం 6 నుంచి 2 గంటల వరకు పని.. టీ, బ్రేక్ఫాస్ట్ ఫ్రీ..