SP Charan: ఎస్పీ బాలు వాయిస్ వాడేశారు.. కీడా కోలా టీంకి ఎస్పీ చరణ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎప్పుడో చనిపోయిన ఒక గాయకుడి గొంతును ఏఐ సహాయంతో మళ్లీ రీ క్రియేట్ చేసి ఏఆర్ రెహమాన్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు అని అందరూ ఆసక్తికరంగా మాట్లాడుకుంటున్న సమయంలో ఒక షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే రెహమాన్ కంటే ముందే మన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ ఒకరు ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ సహాయంతో రీ క్రియేట్ చేశారు. అయితే ఈ విషయం మీద ఎస్పీ బాలసుబ్రమణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ఈ మధ్యకాలంలో తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో కీడాకోలా అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతన్య రావు, జీవన్, విష్ణు వంటి వారు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందించాడు. అయితే ఒక చిన్న కామెడీ సీక్వెన్స్ లో భాగంగా మా ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిస్ ని ఏఐ ద్వారా రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. స్వాతిలో ముత్యమంత అనే సాంగ్ సినిమాలో ఒక కామెడీ సీక్వెన్స్ కోసం వాడారు. దాని కోసమే ఏఐ ద్వారా సాంగ్ రీ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read; Pakistan Army: ఇమ్రాన్ ఖాన్కు ప్రధాని పదవిని ఆఫర్ చేసిన పాక్ ఆర్మీ.. కానీ, కండిషన్స్ అప్లై
Also Read
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
- Splitsvilla: ‘ప్రేమ కావాలా? పైసా కావాలా?’: జియోహాట్స్టార్ తెలుగులో ‘ఎమ్టీవీ స్ప్లిట్స్విల్లా X6’ స్ట్రీమింగ్!
- Mega 158: డాడీ కోసం పెద్ది!
ఈ విషయం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన జనవరి 18వ తేదీన సంగీత దర్శకుడు వివేక్ సాగర్ సహా సినీ దర్శక నిర్మాతలకు కూడా నోటీసులు పంపారు. అయితే ఆ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం మీద ఎస్పీ చరణ్ స్పందిస్తూ నాకు దూరమైన మా తండ్రి వాయిస్ ని ఏ ద్వారా రీ క్రియేట్ చేయడం బాగుంది , చనిపోయినా ఆయన గొంతుకు ఇంకా జీవం పోసిన టెక్నాలజీ శక్తి సామర్థ్యాలను మేము స్వాగతిస్తున్నాం కానీ కనీసం మాకు సమాచారం ఇవ్వకుండా, మా అనుమతి తీసుకోకుండా ఇలా ఆయన గొంతును రీక్రియేట్ చేయడం మాకు బాధ కలిగించిందనీ అన్నారు. వ్యాపారం కోసం ఇలాంటి పనులు చేయడం సరి కాదు’ అది ఏమాత్రం కరెక్ట్ కాదు. అందుకే ఈ విషయంలో లీగల్ గా ముందుకు వెళ్లాం అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Rupee: రూపాయి గరిష్ట పతనంపై.. ఆర్బీఐ సంచలన నిర్ణయం..
-
KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్కతా టార్గెట్ ఎంతంటే..
-
Off The Record : జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ గురించి టీడీపీలో చర్చలు
-
Uttar Pradesh: జిమ్లలో హిందూ మహిళలే టార్గెట్.. నిందితులపై యోగి సర్కార్ ఉక్కుపాదం..
-
Story Board : రూపాయి పతనం సెంచరీకి చేరువౌతోందా..? ఇరాన్ యుద్ధమే కొంప ముంచుతోందా..?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!