NTV Telugu Site icon

Manamey : పిఠాపురంలో శర్వానంద్ ‘మనమే’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్ ఎవరంటే..?

Manamey

Manamey

Manamey : టాలీవుడ్ హీరో శర్వానంద్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మనమే’.ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మాత టిజి విశ్వప్రసాద్‌ ఎంతో గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో క్యూట్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా శర్వానంద్ కెరీర్ లో 35 వ సినిమాగా తెరకెక్కుతుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 7 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,టీజర్ ,సాంగ్స్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసాయి.

Read Also :Kajal Aggarwal: కాజల్ అగర్వాల్ అభిమానులకు షాక్.. ఇండియన్ 2లో చందమామ లేదు!

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.తాజాగా గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది.ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను పిఠాపురం లో ఈనెల 5 న గ్రాండ్ గా నిర్వహించున్నట్లు సమాచారం.అలాగే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా గ్లోబల్ స్టార్ రాంచరణ్ రానున్నారు.పిఠాపురం పవన్ కల్యాణ్ పోటీ చేసిన నియోజకవర్గం కావడంతో ఈ ఈవెంట్ కు పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ భారీగా వచ్చే అవకాశం వుంది.